ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎన్నార్‌ బార్‌లో ఈ నెల 6న పట్టుబడిన నకిలీ మద్యం తయారీ రాకెట్‌ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి.

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎన్నార్‌ బార్‌లో ఈ నెల 6న పట్టుబడిన నకిలీ మద్యం తయారీ రాకెట్‌ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ పెద్దలు వెనుక ఉండి.. అద్దేపల్లి జనార్దనరావును ముందు పెట్టి ఈ స్కామ్‌ నడిపారని ఆధారాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ బావమరిది పోసాని కోటేశ్వరరావుకు, అద్దేపల్లి జనార్దనరావుకు మధ్య వాట్సాప్‌ చాటింగ్‌ ఆధారాలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇందులో జనార్దనరావు ‘సార్‌.. ఈ వీక్‌ ఎమౌంట్‌ పంపించాను’ అని టెక్ట్స్‌ చేయగా.. ‘రూ.18 లక్షలకు గాను రూ.15 లక్షలే పంపించావు’ అని కోటేశ్వరరావు రిప్లై ఇచ్చారు. ‘వచ్చి కలుస్తాను’ అని జనార్దన్‌ చెప్పగా.. ‘కలవడం కాదు.. బావ ఊరుకోడు.. రిమైనింగ్‌ అమౌంట్‌ పంపించు. నెక్ట్స్‌ వీక్‌ ఇలా చేయకు’ అని కోటేశ్వరరావు చాట్‌ చేసిన వాట్సాప్‌ మెసేజ్‌ కలకలం సృష్టిస్తోంది. అద్దేపల్లి జనార్దన్‌రావు ఆధ్వర్యంలో నకిలీ మద్యం ప్లాంట్లను కూటమి నాయకులే పెట్టించారనే చర్చ జరుగుతోంది.

బాగోతం మొత్తం బట్టబయలు కావడంతో విదేశాల్లో ఉన్న జనార్దన్‌రావును హుటాహుటిన రప్పించి రిమాండ్‌కు పంపడం.. ఆయన ద్వారా వీడియో రిలీజ్‌ చేయించారు. మరోవైపు అన్నమయ్య జిల్లా ములకలచెరువులో, ఇటు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం ప్లాంట్‌ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది.

ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎన్నార్‌ బార్‌లో ఈ నెల 6న పట్టుబడిన నకిలీ మద్యం తయారీ రాకెట్‌లో ఎక్సైజ్‌ శాఖ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఇంట్లో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 2 గంటల వరకు సోదాలు జరిగాయి. నిరంతర పర్యవేక్షణ కోసం అధికారులు జనార్దనరావు ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఫెర్రీ రోడ్డులో కూడా కెమెరాలు బిగించారు. వాటిని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌తో అనుసంధానం చేశారు.

Updated On
ehatv

ehatv

Next Story