✕
Pithapuram: రెండో పెళ్లికి అడ్డుగా ఉందని 5 నెలల పసికందును చంపేసిన అమ్మ, అమ్మమ్మ
By ehatvPublished on 13 May 2025 5:47 AM GMT
పిఠాపురం (Pithapuram)మండలం నరసింగపురానికి చెందిన శైలజ రెండేళ్ల క్రితం సతీష్ (Satish)అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది.

x
పిఠాపురం (Pithapuram)మండలం నరసింగపురానికి చెందిన శైలజ రెండేళ్ల క్రితం సతీష్ (Satish)అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కొద్ది కాలం క్రితం తిరిగి ఇంటికొచ్చిన శైలజ, 5 నెలల క్రితం యశ్విత(Yashwitha) అనే పసిబిడ్డకు జన్మనిచ్చింది. అయితే శైలజ(Shailaja) మనసు మార్చి, తనకు తన కులానికి చెందిన వ్యక్తితో రెండో వివాహం జరిపించాలని శైలజ అమ్మ అన్నవరం నిర్ణయించింది. దీనికి పాప యశ్విత అడ్డు తొలగించాలని, 5 నెలల పసికందును ఈ నెల 6న గొంతు నులిమి చంపేసి.. ఇంటి పక్కనే ఉన్న బావిలో పడేశారు. తర్వాత ఎవరో తమ ఇంటికి క్షుద్ర పూజలు చేసి చిన్నారిని చంపేశారని ఇంటి ముందు ముగ్గు వేసి, నిమ్మకాయలు పెట్టి నమ్మించారు. చివరకు పోలీసులు విచారించగా చిన్నారిని తామే చంపినట్టు అమ్మ, అమ్మమ్మ ఒప్పుకున్నారు

ehatv
Next Story