Visakhapatnam land allocations: విశాఖ భూ కేటాయింపులపై సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ..!
Visakhapatnam land allocations: విశాఖ భూ కేటాయింపులపై సర్కార్కు హైకోర్టులో ఎదురుదెబ్బ..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకే కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలందనే చెప్పాలి. విశాఖపట్నంలోని అడవి వరం మరియు ముడసరిలోవలో 480 ఎకరాలలో ఏర్పాటు కానున్న ఆదాని డేటా సెంటర్ కు భూమి ఉచితంగా ఇవ్వటంపై హైకోర్టు తీవ్ర ఆక్షేపణ తెలిపింది. 5 వేల కోట్ల రూపాయల విలువైన 480 ఎకరాల ప్రభుత్వ భూమిని డేటా సెంటర్ ఏర్పాటు చేస్తారనే ఉద్దేశంతో ఉచితంగా ఇవ్వటాన్ని హైకోర్టులో సవాలు చేసిన అనకాపల్లి JBP జై భీమ్ భారత్ పార్టీ పార్టీ జిల్లా అధ్యక్షులు నేతల నాగేశ్వరరావు. రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆదాని ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఆదాని పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు 5000 కోట్ల రూపాయల విలువైన 480 ఎకరాల ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం. భూమితో పాటుగా 1000కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇస్తాము అంటూ జీవో ఎంఎస్ నెంబర్ 40 తేదీ 11- 10- 2025న ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. 480 ఎకరాల ప్రభుత్వ భూమిని తక్షణమే ఈ కంపెనీలకు బదలాయించాల్సిందిగా జీవో ఎంఎస్ నెంబర్ 66 మరో ఉత్తర్వులు జారీఈ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ Clause 4 జీవో ఎంఎస్ నెంబర్ 117 అనుసరించి కంపెనీలకు ఉచితంగా భూమి పదాలయించకూడదు అన్న పిటిషనర్
పిటిషనర్ తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలసీ ప్రకారం కేవలం లీజుకు మాత్రమే భూములు ఇవ్వాలి అని ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత మాత్రమే భూ బదలాయింపు జరగాలని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. ఒకసారి పూర్తి అధికారాలు భూమి మీద బదలాయిస్తే రేపు ఈ భూమిని తిరిగి తీసుకునే హక్కు రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది అన్న పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్, ఒక్కసారి పరిశ్రమ ఏర్పాటు కాకుండా సేల్ డీడ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాశి ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి అధికారాలు భూమిపై కోల్పోతుంది అన్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.
దీంతో కేవలం లీజు పద్ధతిలో మాత్రమే భూమి ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ ఏ పాలసీ ప్రకారం భూమిని బదలాయిస్తున్నారు అంటూ హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం. ఈ జీవోలను అనుసరించి ఏమైనా సేల్ డీడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతివాదుల కంపెనీలకు రాసిందా అంటూ న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్. ఏ చట్టాన్ని ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం భూ బదలాయింపు చేస్తుంది అని ప్రశ్నించిన హైకోర్టు ధర్మాసనం. కేవలం అగ్రిమెంట్ ఆఫ్ సేల్ మాత్రమే రాయాలి అని చట్టం చెబుతుంటే సేల్ డీడ్ ఎలా రాయమని అధికారులకు ఉత్తర్వులు ఇస్తారు అంటూ ప్రశ్నించిన న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వం ఏ సందర్భంలో ఈ జీవో ఇచ్చిందో తెలుసుకోవటానికి రెండు వారాల సమయం కోరిన అడ్వకేట్ జనరల్ తమ్మలపాటి శ్రీనివాసరావు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. భూ బదలాయింపులు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న చట్టాలను పాటించాలి కదా అంటూ ప్రశ్నించిన న్యాయస్థానం. తనకు కొంత సమయం ఇవ్వాలి అంటూ కోర్టుని అభ్యర్థించిన అడ్వకేట్ జనరల్ తమ్మలపాటి శ్రీనివాసరావు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.


