High Court is angry: ఏపీ పోలీసుల వ్యవహారశైలిపై హైకోర్టు ఆగ్రహం.. ఇలా ఎలా చేస్తారని పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు..!
High Court is angry: ఏపీ పోలీసుల వ్యవహారశైలిపై హైకోర్టు ఆగ్రహం.. ఇలా ఎలా చేస్తారని పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు..!

ఏపీ పోలీసులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల తీరుపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితులను రోడ్లపై పోలీసులు నడిపించటం పై ఏపీ హైకోర్టులో దాఖలైన పిల్పై హైకోర్టు విచారించింది. కేసు నమోదైన తక్షణమే నిందితులను తమ ఇష్టానుసారంగా రోడ్లపై నడిపిస్తూ అవహేళనకు గురి చేస్తున్నారంటూ అంటూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ అండ్ ప్రాపర్టీ ఎన్విరాన్మెంటల్ రైట్స్ విజయవాడ జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్ కుమార్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. కొన్ని వీడియోలు, ఫోటోలు న్యాయస్థానానికి అందజేసిన పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. కొవ్వూరులో నిందితుడిని తీసుకువెళ్ళే వాహనం బ్రేక్ డౌన్ అవటంతో రోడ్డుపై వెళ్తుండగా ఫొటోలు తీశారని కోర్టుకి తెలిపిన ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ తమ్మలపాటి శ్రీనివాస్. ఇలాంటి ఘటనలు అనేకం రాష్ట్ర వ్యాప్తంగా జరిగాయని, ఇది చట్టవిరుద్ధమైన చర్యగా చెప్పిన పిటిషనర్. పోలీసుల నిందితులను నడి రోడ్డుపై నడిపించడం తో పాటు బహిరంగంగా తెనాలిలో యువకులను కొట్టిన అంశాన్ని సైతం కోర్టు దృష్టికి తీసుకువెళ్లిన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్.రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిందితుల పట్ల ప్రవర్తించిన తీరును వీడియోలు, ఫోటోలు రూపంలో న్యాయమూర్తికి జడ శ్రవణ్ కుమార్ అందజేశారు. పోలీసుల తీరును నిలువరించాల్సిన అవసరం ఉందన్న జడ శ్రవణ్, పోలీసులు ప్రభుత్వం మెప్పు పొందేందుకు నిందితుల ఆత్మాభిమానం దెబ్బతీస్తున్నారని వాదనలు. జడ శ్రవణ్ వాదనలతో ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, చల్లా గుణరంజన్ తో కూడిన ధర్మాసనం. పోలీసులు ఇలా ఎలా వ్యవహరిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. కొన్ని వీడియో లలో పోలీసులు ఇష్టారీతిన తిడుతున్నట్టు ఉంటుందన్న న్యాయస్థానం, ఇలాంటి ఘటనలు పురావృతం కాకుండా చూసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గుంటూరు, కృష్ణ జిల్లాల ఎస్పీలు ఈ విషయమై ప్రమాణ పత్రం దాఖలు చేయాలి అంటూ హైకోర్టు ఆదేశించి, తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది హైకోర్టు


