Jana Sena leaders: జనసేనలో సలసల..!

జనసేన పార్టీలో, నాయకుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. జనసేన పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల నాయకుల్లో అసంతృప్తి ఒకే ఎత్తు అయితే, జనసేన పార్టీ నాయకుల పట్ల, పవన్ కళ్యాణ్ అసంతృప్తి గురించి నిన్న మాట్లాడుకున్నాం, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు యాక్టివ్ గా ఉండట్లేదు, ప్రభుత్వం పైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, మిగతా నాయకులు విమర్శలు చేస్తున్న సందర్భంగా తిప్పి కొట్టలేకపోతున్నారు, కల్తి లడ్డు అంశానికి సంబంధించి కూడా నాయకులు ఎవరు పట్టించుకోవట్లేదు, మాట్లాడట్లేదు, అన్నిటికీ నేనే సమాధానం చెప్పాలంటే ఎలా, మీరు బాధ్యత తీసుకోకపోతే ఎలా, అంటూ పవన్ కళ్యాణ్ నిన్న పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో వ్యాఖ్యానించినట్లుగా వార్తలు చూశాం. పార్టీ ముఖ్య నాయకుడు, సోదరుడు నాగబాబు వ్యవహార శైలి పైన కూడా పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎందుకు మీరు మాట్లాడట్లేదు, ఎందుకు ప్రభుత్వాన్ని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేయట్లేదు అంటూ మాట్లాడినట్టుగా చూశాం. అనేకమంది పార్టీకి సంబంధించిన నాయకులు పార్టీతో ప్రభుత్వ విధానాలతో అంటి ముట్టునట్టుగా ఉంటున్నారు సో ప్రతిపక్షం వేసే కౌంటర్లకు ప్రతిపక్షం చేసే విమర్శలకు సమాధానం చెప్పలేకపోతున్నారు, ఈవెన్ జనసేన పార్టీపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న సందర్భంగా కూడా, యాక్టివ్ గా వాటిని కౌంటర్ చేయలేకపోతున్నారు అంటూ పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు చూశాం. ఆయన ప్రసంగం చేసి సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు లాంటి వార్తలు కూడా చూశాం. మిగతా నివేదిక ఏదో నాకు ఇవ్వండి వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చేయాలి ఏంటనే దానిపై నాకు నివేదిక ఇవ్వండి అంటూ, నాదేండ్ల మనోహర్‌ చెప్పి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయినట్లుగా వార్తలు చూశాం. ఇది జరిగిన తర్వాత రోజు జనసేన పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రెటరీ, పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేశారు. బొలిశెట్టి సత్యనారాయణ సుదీర్ఘ కాలంగా పవన్ కళ్యాణ్‌తో కలిసి నడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ పక్కన పిడికెడు మంది నాయకులు ఉన్న సమయంలో కూడా ఆయన పార్టీలో ఉన్నారు. పార్టీకి సంబంధించిన కాస్త ఇంటలెక్చువల్ టీంలో బొలిశెట్టి సత్యనారాయణ కూడా మెంబర్ గా ఉన్నారు. పార్టీ నిర్మాణంలో మొదటి నుంచి పని చేస్తున్న అతి కొద్ది మంది వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా అత్యంత కీలకమైన బాధ్యతల్లో ఉన్న వ్యక్తి. ఆయన పార్టీకి రాజీనామా చేయడం అనేది కచ్చితంగా షాక్ ని కలిగించే వార్త. జనసేన పార్టీకి, నిజానికి జనసేన పార్టీలో ఉన్న, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకులు తర్వాత, ఎలక్షన్ ముందు టికెట్ల కోసం వచ్చి చేరిన వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత పదవుల కోసం, మరికొంత మంది చేరిన వాళ్ళు ఉన్నారు. కానీ పార్టీని, పవన్ కళ్యాణ్ ని, పవన్ కళ్యాణ్ ఐడియాలజీని, ముందు నుంచి నమ్మి ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్న వ్యక్తులు అతి కొద్ది మంది ఉంటే, వారిలో బొలిశెట్టి సత్యనారాయణ ఉన్నారు. ఆయన పార్టీ జనరల్ సెక్రెటరీగా ఉన్నారు, ఆయన పార్టీని వదిలేసి వెళ్ళడం అనేది, జనసేన పార్టీ ఆలోచన చేయాల్సిన అంశం. తానేదో కోర్టులో పిటిషన్ వేశాను, ఆ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, నేను పిటిషనర్ గా ఉన్నాను, సో పార్టీలో కొనసాగడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి రాజీనామా చేశాను అని చెప్తున్నారు. కానీ ఆయన రెండు రోజుల క్రితం ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ వీడియోలో ఆయన ఇంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు, పదవులు వచ్చాయి, 3000 మందికి పైగా జనసేన నాయకులకు పదవులు వచ్చాయి అని చెప్తున్నారు, ఇంతమంది జనసేన పార్టీకి సంబంధించిన నాయకులకు పదవులు వచ్చాయి అని ఆశ్చర్యం వేసింది, అందరిని చూస్తే వాళ్ళు ఎవరు కూడా జనసేన నాయకులుగా కనిపించట్లేదు తరహా వ్యాఖ్యలతో, ఆయన వీడియో చేశారు. ఇక్కడ ఎక్కడ కింది స్థాయిలో ఏ కమిటీలు వేసినా, అక్కడ ఎవరు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కనిపించట్లేదు, పదవుల్లో అన్యాయం జరుగుతోంది, ప్రభుత్వం మాది అని మనం అనుకుంటున్నాం, తప్ప ప్రభుత్వానికి సంబంధించిన యాక్టివిటీలో ఎక్కడా ఇన్వాల్వ్మెంట్ కనిపించట్లేదు, నామినేటెడ్ పదవులు జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల ఇన్వాల్వ్మెంట్ ఎక్కడా ఉండట్లేదు అంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేయడం చూశాం. జనసేన పేరుతో వేరే పార్టీల వాళ్ళకు పదవులు వచ్చాయి తప్ప, జనసేన కోసం పనిచేసిన ఒరిజినల్ కార్యకర్తలు ఎవరికీ పదవులు రాలేదు అనేది బొలిశెట్టి సత్యనారాయణ ఆవేదనగా కనిపించింది. ఆయన అటువంటి ఆవేదన వ్యక్తం చేసిన తర్వాత, వన్ టూ డేస్ కి రాజీనామా చేశారు. రాజీనామా చేశారా చేయించారా రీజన్ ఏంటో తెలియదు కానీ, పార్టీ అధికారంలో ఉన్న సమయంలో జనసేన పార్టీకి అధికారం ఉంటుందో లేదో, జనసేన పార్టీ అసలు నిలబడుతుందో లేదో, జనసేన పార్టీ అధినేత రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన సమయంలో కూడా ఆయనతో కలిసి నడిచిన వాళ్ళు, జనసేన పార్టీ ఎస్టాబ్లిష్ అయి, జనసేన పార్టీకి ఒక 21 మంది ఎమ్మెల్యేలు ఉండి, ఆ పార్టీ అధినేత ఉపముఖ్యమంత్రిగా ఉండి, పార్టీ అధికారంలో ఉండి, సరిగ్గా రెండేళ్ళు కూడా గడవకముందే, పార్టీని వదిలేసి వెళ్ళడం, పార్టీ పైన అసంతృప్తి వ్యక్తం చేయడం, ఇది కచ్చితంగా జనసేన పార్టీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, బలోపేతం, విస్తరణ వీటికి సంబంధించిన ఆలోచన చేస్తారా ఎవరైనా, కానీ జనసేన పార్టీకి సంబంధించి ముందు నుంచి ఉన్న నాయకులు ఇప్పుడు ఆ పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం అనేది, జనసేన పార్టీ ఆలోచన చేయాల్సిన అంశం. కచ్చితంగా షాక్ ని కలిగించే అంశమే, ఓ పక్క బొలిసెట్టి సత్యనాయణ అంశం అదయితే, మరో పక్క అడ్వకేట్ రజిని ఆమె జనసేన పార్టీకి సంబంధించి చాలా యక్టివ్ గా పని చేస్తూ వచ్చారు. జనసేన పార్టీకి సంబంధించిన విధానాలని, జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. నిత్యం మీడియాలో అనేక చర్చా వేదికల్లో జనసేన పార్టీకి సంబంధించిన వాయిస్ ని వినిపిస్తూ వచ్చారు. లీగల్ ఫైట్ చేస్తూ వచ్చారు, అమరావతి ఉద్యమంలో యాక్టివ్ గా పని చేస్తూ వచ్చారు, ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నారు. జనసేన పార్టీకి సంబంధించిన నాయకురాలిగా రజినీ అడ్వకేట్, ఆమె అంబటి రాంబాబు నివాసం పైన జరిగిన దాడి, అక్కడ ప్లెక్సీల ఏర్పాటు, అక్కడ కర్రలు పట్టుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తిరగడం ఇవన్నీ కూడా చట్ట వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రజలు యాక్సెప్ట్ చేసేలా లేవు, గుంటూరు పట్టణానికి సంబంధించిన పీస్ ని దెబ్బతీసేలా ఉన్నాయి, అధికారంలో ఉన్న మనం, అధికార కూటమిగా ఉన్న మనం ప్రజలకు సంబంధించిన పీస్ ని దెబ్బ తీస్తే ఎట్లా, మన కూటంమి భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ, రోడ్లపైన ఫ్లెక్సీలు కట్టేసి రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కట్టేసి, ఆ ఫ్లెక్సీలకి అండగా మేము కర్రలు పట్టుకొని నిలబడతామ అంటూ కార్పొరేషన్ చైర్మన్లు, కర్రలు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే, ఇది మన ప్రభుత్వం అని ఎలా చెప్పుకోవాలి, గుంటూరు ప్రజలు, గుంటూరు నగరంలో ఈ రకంగా శాంతి భద్రతలు లేకుండా ఉన్న వాతావరణాన్ని చూసి మన ప్రభుత్వం గురించి ఏమనుకుంటారు, మన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా, పైగా భారతీయ జనతా పార్టీని, తెలుగుదేశం పార్టీని కలిపి, రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడడానికి ప్రధాన భూమిక పోషించిన పవన్ కళ్యాణ్, దీనికి సంబంధించి నెగిటివిటీని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా, ఇది సరైనది కాదు కదా అంటూ ఆమె ప్రశ్నిస్తూ వచ్చారు. ఆమె ప్రశ్నించడం మొదలు పెట్టిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన నాయకుల వైపు నుంచి నువ్వు ఇలా ప్రశ్నించడం ఆపేయ్, నువ్వు ఇలా మాట్లాడొద్దు, ప్రభుత్వాన్ని విమర్శించొద్దు, వాళ్ళు ఫ్లెక్సీలు కట్టినా, కర్రలు పట్టుకొని తిరిగినా ఇళ్లపై దాడులు చేసినా, ఇల్లు తగలబెట్టినా నువ్వు ఎక్కడ మాట్లాడొద్దు అంటూ పార్టీ నాయకత్వం వైపు నుంచి ఆమెకు సమాచారం వచ్చింది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' పూర్తి విశ్లేషణ..!



Updated On
ehatv

ehatv

Next Story