తమ కుమారుడి పెళ్లి కంటే ముందు ఇంట్లో కొలువైన ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసుకునేందుకు తేదీ ఖరారు కోసం గురువు వద్దకు వచ్చి ఆనందంతో తిరిగి వెళ్తున్న దంపతులను రోడ్డు ప్రమాదం కబలించేసింది.

తమ కుమారుడి పెళ్లి కంటే ముందు ఇంట్లో కొలువైన ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసుకునేందుకు తేదీ ఖరారు కోసం గురువు వద్దకు వచ్చి ఆనందంతో తిరిగి వెళ్తున్న దంపతులను రోడ్డు ప్రమాదం కబలించేసింది. బైక్‌ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్ల మండలం గనిఆత్కూరు గ్రామానికి దామినేని కుమారి(45), శ్రీనివాసరావు(54) భార్యాభర్తలు. శ్రీనివాసరావు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి ఒక కూతురు ఉమాదేవి, కుమారుడు చంద్రశేఖర్‌ ఉన్నారు. కుమార్తె వివాహం తమ గ్రామానికే చెందిన సాయితో జరిపించారు. ఈ క్రమంలోనే బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్న చంద్రశేఖర్‌కు ఇటీవల వివాహం కుదిరింది. కుమారుడి వివాహానికి ముందు తమ ఇంటిలో కొలువైన ఉప్పలమ్మ తల్లికి పూజలు చేసేందుకు శ్రీనివాసరావు, కుమారి దంపతులు ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం తక్కెళ్లపాడులో ఉన్న ఓ పూజారి వద్దకు వచ్చి ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఆపై బైక్‌పై తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ఎర్రుపాలెం – తక్కెళ్లపాడు మధ్య ఎదురుగా వచ్చిన కోళ్ల లారీ వారి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో దంపతుల తలలకు తీవ్ర గాయాలై ఘటనాస్థలంలోనే మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న కుమారుడు చంద్రశేఖర్‌, కుమార్తె ఉమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. కొడుకు పెళ్లి చూడకుండానే అనంతలోకాలకు వెళ్లిపోయారా అంటూ బంధువులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికులను కలిచివేసింది.

ehatv

ehatv

Next Story