Sannidhi Golla: తిరుమలలో సన్నిధి గొల్లపై సర్కార్‌కు కక్ష ఎందుకు?

సన్నిధి గొల్ల తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ పేరు మనం చాలా సందర్భాల్లో విని ఉంటాం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆలయంలో, స్వామి వారి ఆలయ తలుపులు తెరిచి స్వామి వారిని మొదటిగా దర్శనం చేసుకునేది సన్నిధి గొల్ల. సన్నిధి గొల్లల సేవలు కొన్ని దశాబ్దాలుగా తిరుమలలో కంటిన్యూ అవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని ఆలయాల్లో కూడా చాలా ఆలయాల్లో సన్నిధి గొల్లల సేవలు ఉన్నాయి. అయితే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, సన్నిధి గొల్లలను తీసేసింది. సన్నిధి గొల్ల అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ వివాదాన్ని రాజేసింది. ఆ తర్వాత వైసార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నిధి గొల్లలకు మళ్ళీ అవకాశం కల్పించింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, రాష్ట్రంలో మళ్ళీ సన్నిధి గొల్లపైన కక్ష కట్టినట్టు కనపడుతుంది. చిత్తూరు జిల్లా టిటిడి పరిధిలోని వడమాలపేట మండలం అప్పలాయకుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటాయి. ఈ రెండు ఆలయాల్లో సన్నిధిగొల్ల సేవలు కంటిన్యూ అవుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా సో అక్కడ సన్నిధిగొల్లగా పనిచేస్తున్న వెంకటేశ్వర యాదవ్ అనే వ్యక్తిని గడిచిన 15 రోజులుగా మీరు విధులకు రావాల్సిన అవసరం లేదు అని అధికారులు చెప్పారు. కారణం ఏంటో తెలీదు. వెంకటేశ్వరులు యాదవ్ తండ్రి అంతకుముందు 40 సంవత్సరాలకు పైగా ఇదే ఆలయంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం, అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సన్నిధిగొల్లగా పని చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన కుమారుడు దాదాపు 20 ఏళ్లుగా అక్కడ సన్నిధి గొల్లగా పని చేస్తూ వస్తున్నారు. ఆయన్ని ఆల్ ఆఫ్ సడన్‌గా 15 రోజుల క్రితం మీరు విధులకు హాజరు కావాల్సిన అవసరం లేదు, ఆలయంలో ఒక గోవు ఉంది, ఆ గోవు సంరక్షణ చూడండి, సన్నిధి గొల్లగా ఉదయాన్నే వచ్చి ఆలయంలో సేవలు చేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది. ఏం తప్పు చేసాం, కారణం ఏంటి మపై కక్షతో స్వామి వారికి సేవ చేసే అవకాశం లేకుండా ఎందుకు చేస్తున్నారు అంటూ ఆవేదన చెందుతుంది. కొన్ని దశాబ్దాలుగా మేము చేస్తున్న సేవని, కొన్ని దశాబ్దాలుగా కంటిన్యూ అవుతూ వస్తున్న ఆచారాన్ని, ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత ఎందుకు పక్కన పెడుతుంది, కూటమి సర్కార్లో ఉన్న పెద్దలకు, రాష్ట్ర స్థాయిలో తెలుసో లేదో, తెలియదు కానీ, స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అప్పలాయగుంట గ్రామానికి సంబంధించిన ఓ సామాజిక వర్గం నేతలంతా కలిసి ఆయన్ని అక్కడి నుంచి తొలగించండి అంటూ స్థానిక ఎమ్మెల్యేకు చేసిన ఫిర్యాదు మేరకు, ఆయన్ని విధుల నుంచి తొలగించినట్లుగా సమాచారం ఉంది. రాజకీయపరమైన కారణాలతో స్వామి వారికి కైంకార్యాలు చేస్తున్న, స్వామి వారికి సేవలు చేస్తున్న కుటుంబాలను, స్వామి వారికి దూరం చేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారు, ఆలయాలకు సంబంధించిన సంపద, ఆలయాలకు సంబంధించిన నిర్వహణ బాధ్యతలు బాధ్యతలు, ఆలయాల చైర్మన్ల పదవులు ఇవన్నీ మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు, కానీ ఏ ఆర్థిక లబ్ధి లేకుండా స్వామి వారి పైన ప్రేమతో, పొద్దున్నే లేసి స్వామి వారిని నిద్రలేపి, ఆయన ఆలయంలో సేవ చేసుకునే ఒక అవకాశాన్ని దైవకార్యంగా భావించే కుటుంబాలను అటువంటి కులాలను వేదనకు గురి చేయడం కూటమి సర్కార్‌కు మంచిదేనా.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ YNR విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story