Woman Suicide : భర్తపై ఆధారపడలేక.. తనువు చాలించిన భార్య..!
అన్నింటికీ భర్తపై ఆధారపడుతున్నానని ఓ వివాహిత ఆవేదన చెందింది.

అన్నింటికీ భర్తపై ఆధారపడుతున్నానని ఓ వివాహిత ఆవేదన చెందింది. భర్తకు భారం కావొద్దని తీవ్ర నిర్ణయం తీసుకుంది. ''ప్రతి చిన్న విషయానికి నీపై ఆధారపడడం నాకు ఇష్టం లేదు.. ఇక నీకు భారం కాలేను.. పిల్లల్ని జాగ్రత్తగా చూస్కోండి అంటూ భర్తకు ఫోన్లో మెసెజ్ పెట్టి ఓ వివాహిత గోదావరిలోకి దూకి తనువు చాలించింది. రాజమండ్రి లాలా చెరువు స్పిన్నింగ్ మిల్లు ప్రాంతానికి చెందిన సుంకరం రామకృష్ణ(Ramakrishna), కల్యాణి (Kalyani)(32) దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. ఏలూరు(Eluru)శాంతినగర్ 21 వ డివిజన్ సచివాలయంలో కళ్యాణి ఏఎన్ఎం(ANM)గా పనిచేస్తోంది. కుటుంబంతో స్థానికంగానే నివాసముంటున్నారు. రెండేళ్ల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో కల్యాణి కాలికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె సరిగా నడవలేని పరిస్థితిలో భర్తపై ఆధారపడి జీవనం సాగిస్తోంది. అటు ఉద్యోగంలో, ఇటు కుటుంబంలో భర్తపైనే ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. పనిభారం, మానసిక ఒత్తిడి పెరిగి ఎవరికీ చెప్పకుండా రాజమండ్రి వెళ్లింది. ఆ తర్వాత భర్తకు ఫోన్లో మెసేజ్ చేసింది. ప్రతి పనికి నీ మీద ఆధార పడి ఉంటున్నా.. నిన్ను ఇబ్బంది పెడుతున్నాను అంటూ మెసేజ్ చేసింది. భార్య మెసేజ్ను చూసిన భర్త వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య ఫోన్ ట్రేస్ అవుట్ చేయగా రాజమండ్రిలో చూపించింది. అక్కడికి వెళ్లి వెతగ్గా ఆమె గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
