A young woman was caught: ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని బాబాయ్కు పట్టబడ్డ యువతి.. బాబాయ్ ఏం చేశాడంటే..!

వివాహేతర సంబంధం విషయంలో తలెత్తిన వివాదం తలెత్తింది. దీంతో తన మేనకోడలిని కత్తితో నరికి చంపిన బాబాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా తింగళ్సందై సమీపంలో చోటుచేసుకుంది. తలకుళం ప్రాంతానికి చెందిన అరుణ్ ప్రసాద్ (34) వడ్రంగిగా పనిచేస్తున్నాడు. ఇతనికి, సుబిత (28) అనే యువతికి పదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, సుబితకు అనీష్ (30) అనే వ్యక్తితో పరిచయం, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త ఎంత వారించినా సుబిత తన ప్రవర్తన మార్చుకోలేదు. దీంతో భర్తతో విభేదాలతో సుబిత తన పుట్టింటికి వెళ్లి ఉంటూ, నాగర్కోవిల్లోని ఒక వస్త్ర దుకాణంలో పనిచేస్తోంది. పిల్లలు భర్త వద్ద ఉన్న సమయంలో, అనీష్ను తన ఇంటికి పిలిపించుకోవడం, ఫోన్లో గంటల తరబడి మాట్లాడటం వంటివి చేస్తూ తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. సుబిత వివాహేతర సంబంధాన్ని ఆమె బాబాయి రాజేష్ (45) తీవ్రంగా ఖండించాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఆవేశానికి లోనైన సుబిత, దివ్యాంగుడైన రాజేష్ను కిందకు నెట్టేసి దాడి చేసినట్లు సమాచారం. ఆగ్రహం చెందిన రాజేష్ తన కత్తిని తీసుకొని సుబితపై దాడికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో సుబిత అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు


