మద్యం తాగించి..చెవిలో పురుగుల మందు పోసి ప్రియుడు భర్తను హత్య చేశాడు.

మద్యం తాగించి..చెవిలో పురుగుల మందు పోసి ప్రియుడు భర్తను హత్య చేశాడు. అనంతరం భర్త కనబడటం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో స్వీపర్‌గా పనిచేస్తూ తన భార్య రమాదేవి, ఇరవై ఏళ్ళ వయసు దాటిన కొడుకు, కూతుర్లను సంపత్(45) పోషిస్తున్నాడు. భార్య రమాదేవి సర్వపిండి విక్రయిస్తుండగా, తరచూ ఆమె వద్ద సర్వపిండి కోసం వచ్చి కర్రె రాజయ్య(50) అనే వ్యక్తి పరిచయం పెంచుకున్నాడు. వీరి పరిచయం వివాహేతర సంబంధంగా మారడంతో ఎలాగైనా సంపత్ అడ్డు తొలగించుకోవాలని యూట్యూబ్‌లో చూసి భార్య రమాదేవి పథకం వేసింది. ఎవరి చెవిలోనైనా గడ్డి మందు పోస్తే చనిపోతారని యూట్యూబ్‌లో చూసి అదే పద్ధతిలో హత్య చేయాలని ప్రియుడికి రమాదేవి సూచించింది. పార్టీ చేసుకుందామని పిలిచి బొమ్మకల్ ఫ్లైఓవర్ వద్ద సంపత్‌తో కలిసి మద్యం సేవించిన రమాదేవి ప్రియుడు రాజయ్య, అతని స్నేహితుడు శ్రీనివాస్. మద్యం మత్తులో తూలుతూ కింద పడిపోగానే చెవిలో గడ్డి మందు పోసి, అతను చనిపోగానే రమాదేవికి ఫోన్ చేసి సంపత్ చనిపోయాడని రాజయ్య తెలిపాడు. మరుసటి రోజు భర్త కనిపించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేసి, ఆగస్టు 1వ తేదీన మృతదేహం దొరికిందని పోలీసులకు రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ సమాచారం అందించారు. భర్త మృతికి కారణాలు తెలుసుకోకుండా, మృతదేహానికి పోస్టు మార్టం చేయొద్దని అడగడంతో రమాదేవిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అదుపులోకి తీసుకొని విచారించగా తామే హత్య చేసినట్టు అంగీకరించిన రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్. దీంతో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించిన పోలీసులు

ehatv

ehatv

Next Story