విజయ్ మాల్యా, ఒకప్పుడు "కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్" ( King of Good Times)అని పిలువబడిన లిక్కర్ బారన్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు.

విజయ్ మాల్యా, ఒకప్పుడు "కింగ్ ఆఫ్ గుడ్ టైమ్స్" ( King of Good Times)అని పిలువబడిన లిక్కర్ బారన్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ వ్యవస్థాపకుడు. ఇటీవల రాజ్ శమని హోస్ట్ చేసిన పాడ్‌కాస్ట్‌లో తన భారత్‌కు తిరిగి రావాలనే ఆలోచనను వెల్లడించాడు. అయితే.. దీనికి అతను ఒక షరతు విధించాడు. భారతదేశంలో నిష్పక్షపాత విచారణ, గౌరవప్రదంగా జీవించేలా హామీ ఇస్తేనే తిరిగి వస్తానని చెప్పాడు. మాల్యా 2016 మార్చిలో భారతదేశం నుంచి యూకేకు వెళ్లిపోయాడు, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి రూ. 9,000 కోట్ల బ్యాంకు రుణ డిఫాల్ట్ ఆరోపణల నేపథ్యంలో అతనిపై మనీ లాండరింగ్, ఆర్థిక మోసం ఆరోపణలు ఉన్నాయి, ఇవి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారిస్తున్నాయి.

రాజ్ శమని నాలుగు గంటల పాడ్‌కాస్ట్‌లో, మాల్యా తనను "ఫ్యూజిటివ్" అని పిలవడాన్ని సమర్థించాడు, కానీ "చోర్" (thief) అనే ముద్రను తిరస్కరించాడు. "నేను పారిపోలేదు, ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం యూకే(UK)కు వెళ్లాను. తిరిగి రాకపోవడానికి కారణాలు ఉన్నాయన్నాడు. నిష్పక్ష విచారణ హామీ ఇస్తే, తిరిగి రావడానికి ఆలోచిస్తానని చెప్పాడు. భారతదేశం(India)లోని జైలు పరిస్థితులు మానవ హక్కుల ఉల్లంఘనకు గురిచేస్తాయన్నాడు

భారత ప్రభుత్వం మాల్యా(Vijay Mallya ) యొక్క రూ. 14,131 కోట్ల ఆస్తులను జప్తు చేసి, బ్యాంకులకు చెల్లించిందని ఆర్థిక మంత్రి తెలిపారు. అయినప్పటికీ, మాల్యా ఇంకా రూ. 11,101 కోట్ల రుణం బాకీ ఉందని బ్యాంకులు పేర్కొన్నాయి. మాల్యా ప్రస్తుతం లండన్‌(Landon)లో నివసిస్తున్నాడు, ఎక్స్‌ట్రాడిషన్‌కు వ్యతిరేకంగా చట్టపరమైన పోరాటం కొనసాగిస్తున్నాడు. అక్టోబర్‌లో విచారణ జరగనుంది. భారత ప్రభుత్వం CBI, ED, NIA టీమ్‌ల ద్వారా ఎక్స్‌ట్రాడిషన్‌ను వేగవంతం చేయడానికి యూకేతో చర్చలు జరుపుతోంది. మాల్యా తిరిగి రావడానికి సుముఖత వ్యక్తం చేసినప్పటికీ, అతని షరతులు, యూకేలో కొనసాగుతున్న చట్టపరమైన అడ్డంకులు దీనిని సంక్లిష్టం చేస్తున్నాయి.

ehatv

ehatv

Next Story