తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది.

తెలంగాణ ప్రభుత్వ పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణలో 42శాతం బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారించింది. బీసీ రిజర్వేషన్ల జీవో నెంబర్ 9 పై తెలంగాణ హైకోర్టు స్టే ను సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎస్టీ ప్రాంతాలలోనే రిజర్వేషన్ల పెంపుకు మినహాయింపులు ఉన్నాయి కదా అని ప్రశ్నించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదిస్తూ.. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని.. తెలంగాణ బీసీ బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం ఇవ్వలేదు

అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయని, శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించారని, డేటా బేస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించుకోవచ్చని ఇందిరా సహాని కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పకడ్బందీగా సర్వే నిర్వహించామన్నారు. గవర్నర్ బిల్లు పెండింగ్లో పెట్టడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది, ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్ లో పెట్టారు.

బిల్లును ఛాలెంజ్ చేయకుండా బిల్లు ద్వారా విడుదల చేసిన జీవోను సవాల్ చేశారని.. రిజర్వేషన్లను పెంచుకునే సౌలభ్యం ఇందిరా సహాన్ని జడ్జిమెంట్ లో 9 మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందని సింఘ్వీ అన్నారు. సుప్రీంకోర్టు విధించిన ట్రిపుల్ టెస్ట్ కండిషన్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది, డెడికేటెడ్ కమిషన్ ద్వారా సర్వే జరిపి ఎంపరికల్ డేటా సేకరించిందన్నారు. కమిషన్ సిఫారసు ప్రకారం రిజర్వేషన్లు నిర్ణయించాం, బీసీ జనాభా డేటా ఆధారంగానే బీసీల రిజర్వేషన్లు పెంచామని, ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించామన్నారు. సమగ్రంగా , సాంకేతికంగా సర్వే జరిపామన్నారు. అన్ని వర్గాలతో విస్తృత సంప్రదింపులు జరిపామని, 94,000 మంది డేటా సేకరించారు, ఇండియాలో ఎక్కడ లేని విధంగా ఈ సర్వే నిర్వహించామన్నారు. దీనిపైన స్టే ఎలా విధిస్తారు ? హైకోర్టు మధ్యంతర తీర్పులో ఎలాంటి సహేతుక కారణాలు లేవు, ఎంపరికల్ డేటా ద్వారా ట్రిపుల్ టెస్ట్ నిర్వహించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని గౌలి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు సింఘ్వీ. దీనిపై పిటిషన్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో స్పష్టం చేసిందని.. షెడ్యూల్డ్ ఏరియా ,గిరిజన ప్రాంతాలలో మాత్రమే 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకునేందుకు అనుమతి ఉందని, జనరల్ ఏరియాలలో రిజర్వేషన్లను 50 శాతానికి మించి పెంచడానికి వీలులేదన్నారు. తెలంగాణలో అలాంటి షెడ్యూల్ ఏరియాలు లేవు, కృష్ణమూర్తి కేసులో సుప్రీంకోర్టు ఇదే తీర్పు వెల్లడించిందని, మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్ లో కూడా సుప్రీంకోర్టు రిజర్వేషన్ల పెంపును తిరస్కరించిందన్నారు. దీంతో 50 శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది, ట్రిపుల్ టెస్ట్ లో కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్ ఉండదని, పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది.

Updated On
ehatv

ehatv

Next Story