Deputy CM Ajit Pawar passes : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూత!

విమానం కుప్పకూలిన ఘటనలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కన్నుమూసినట్లు పీటీఐ వెల్లడించింది. ఆయనతోపాటు మరో ముగ్గురు కూడా చనిపోయినట్లు తెలిపింది. బారామతి సభకోసం ఆయన వెళ్తున్న ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా కూలిపోయిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయినట్లు సమాచారం. జిల్లా పరిషత్ ఎన్నికలకు ప్రచార సమావేశాలు బారామతిలో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అజిత్ పవార్ బుధవారం ఉదయం ముంబై నుంచి ప్రత్యేక విమానంలో బారామతికి బయలుదేరారు. అయితే, విమానం ఎయిర్‌పోర్ట్ రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా, అకస్మాత్తుగా సాంకేతిక లోపం ఏర్పడింది. దీని కారణంగా, పైలట్ నియంత్రణ కోల్పోయి విమానం కూలిపోయింది. ప్రమాదం చాలా దారుణంగా జరిగినట్లు సమాచారం.

Updated On
ehatv

ehatv

Next Story