బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 47 మంది గాయపడ్డారు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా జూన్ 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించగా, 47 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో హాసన్ జిల్లాకు చెందిన 20 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి భూమిక్ లక్ష్మణ్ (Bhumik Lakshman)కూడా మృతి చెందాడు. RCB తమ తొలి ఐపీఎల్ టైటిల్ గెలిచిన సందర్భంగా విధాన సౌధ వద్ద జరిగిన సన్మాన కార్యక్రమం తర్వాత, వేలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్ద ఆటగాళ్లను చూసేందుకు తండోపతండంగా తరలివచ్చారు. ఒకే గేట్ ద్వారా ప్రవేశించేందుకు ప్రయత్నించిన జనం కారణంగా తొక్కిసలాట జరిగింది. సుమారు 300-400 మంది ఒక చిన్న దారిలో చిక్కుకోవడంతో ఈ దుర్ఘటన సంభవించింది. భూమిక్, బసవనగుడిలోని BIT కాలేజీలో ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ విద్యార్థి. క్రికెట్ లేదా జనసమూహంపై పెద్దగా ఆసక్తి లేని భూమిక్, తన స్నేహితులతో కలిసి స్టేడియానికి వెళ్లాడు. స్టేడియంలోకి ప్రవేశించే సమయంలో అతను తన స్నేహితుల నుండి విడిపోయాడు, తొక్కిసలాటలో చిక్కుకొని మరణించాడు. ఆసుపత్రిలో ఐసీయూ(ICU)లో చేరినప్పటికీ, అతనిని కాపాడలేకపోయారు.

భూమిక్ తండ్రి బీటీ లక్ష్మణ్, హాసన్ జిల్లాలోని కుప్పగోడు గ్రామంలో తన కొడుకు సమాధి వద్ద కన్నీరు పెట్టుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరలయింది. "నా కొడుకు కోసం కొన్న భూమిలో ఇప్పుడు.. నా కొడుకు సమాధి ఉంది. లేచిరా బిడ్డా, 100 కోట్ల ఆస్తి కూడ పెట్టాను" అంటూ గుండెలవిసేలా రోదించాడు. "నా కొడుకుకు జరిగిన దుర్ఘటన ఎవరికీ జరగకూడదు," అని అతను వాపోయాడు. లక్ష్మణ్ ఈ ఘటనను "సిస్టమాటిక్ నిర్లక్ష్యం" అని ఆరోపించాడు. "ఒకే గేట్ ఎందుకు తెరిచారు? జనసమూహాన్ని నియంత్రించే సౌకర్యాలు ఎందుకు లేవు?" అని ప్రశ్నించాడు. ఈ ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశారు, బెంగళూరు పోలీసు కమిషనర్‌తో సహా ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. కర్ణాటక హైకోర్టు ఈ ఘటనపై సుమోటోగా తీసుకొని జూన్ 10, 2025న విచారణ షెడ్యూల్ చేసింది. ఈ ఘటన భూమిక్ కుటుంబంలో మాత్రమే కాక, మొత్తం కర్ణాటకలో విషాద ఛాయలు అలుముకుంది. సోషల్ మీడియాలో లక్ష్మణ్ ఆవేదన వీడియోలు వైరల్ కావడంతో ఈ ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

ehatv

ehatv

Next Story