బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4, 2025న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించిన నేపథ్యంలో

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4, 2025న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించిన నేపథ్యంలో, RCB మార్కెటింగ్, రెవెన్యూ హెడ్ నిఖిల్ సోసలే(Nikhil Sosale)ను బెంగళూరు(Bengaluru ) కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అతను ముంబై(Mumbai)కి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి DNA ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ముగ్గురు ఉద్యోగులు కిరణ్(Kiran), సుమంత్(Sumanth), సునీల్ మాథ్యూలను కూడా అదుపులోకి తీసుకున్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశాల మేరకు RCB, DNA ఎంటర్టైన్మెంట్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులను అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ ఘటన;[ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటనలో భద్రతా వైఫల్యాలు, సరైన అనుమతులు లేకుండా ఈవెంట్ నిర్వహించడం వల్ల సంభవించిన లోపాలపై విచారణ జరుగుతోంది. RCB సోషల్ మీడియాలో విజయోత్సవ పరేడ్ను ప్రమోట్ చేసిన తర్వాత, అనుమతి కోసం పోలీసులను సంప్రదించినప్పటికీ, భద్రతా ఆందోళనల కారణంగా అనుమతి నిరాకరించబడింది. అయినప్పటికీ, ఈవెంట్ జరిగి, భారీ జనసమూహం కారణంగా ఈ దుర్ఘటన సంభవించింది. బెంగళూరు పోలీస్ కమిషనర్ బి. దయానందతో సహా పలువురు సీనియర్ పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు, ఈ ఘటనపై విచారణకు జ్యుడిషియల్ కమిషన్ను నియమించారు.
