Full Viewదేశంలో అధికార పార్టీలకి సోషల్ మీడియా ఒక హడల్గా మారిపోయింది. సోషల్ మీడియాకు సమాధానం చెప్పలేక దిక్కులు చూస్తూ, బిక్క మొహాలు వేస్తున్నాయి ప్రభుత్వాలు. కచ్చితమైన ఆధారాలతో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తున్న వాళ్లకో, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్లకో ఆన్సర్ చెప్పలేక అసహనం పెంచుకుంటున్నాయి ప్రభుత్వాలు. ఆ అసహనంతో కేసులు పెడుతున్నాయి, కేసులు క్రిమినల్ కేసులు పెట్టేదాకా వెళ్తున్నాయి, అక్రమ అరెస్టులకు వెళ్తున్నాయి, ఈ నేపథ్యంలో కోర్టులు సోషల్ మీడియాకు అండగా నిలుస్తున్నాయి. కోర్టులు అండగా నిలిచినప్పటికీ, కోర్టుల ఆదేశాలను కూడా పట్టించుకోకుండా, ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇటీవల తెలంగాణలో ఒక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ పైన, తెలంగాణ సర్కార్ కేసు నమోదు చేసిన అంశానికి సంబంధించి హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. హైకోర్టు కొన్ని ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎవరైనా కేసు ఫిర్యాదు చేసినప్పుడు, ఆ ఫిర్యాదును తీసుకోవాల్సి వచ్చినప్పుడు, సోషల్ మీడియా పోస్టుల పైన, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు, ఇమ్మీడియట్ గా కంప్లైంట్ రాగానే ఎఫ్ఐఆర్ నమోదు చేయకూడదు, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి సంబంధించిన లీగల్ శాంటిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి, అది చెక్ చేసిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, లీగల్ ఒపినియన్ తీసుకోవాలి, లీగల్ ఒపినియన్ తీసుకున్న తర్వాత మాత్రమే, ఎఫ్ఐఆర్ చేయాలి అంటూ హైకోర్టు చెప్పింది. ఒక మూడు కీలకమైన అంశాలు చెప్పింది. ఒకటి ఇమ్మీడియట్ గా ఎఫ్ఐఆర్ చేయకూడదు, ఏ కంప్లైంట్ వచ్చినా, రెండు కంప్లైంట్ చేయడానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయా లేదా, కంప్లైంట్ చేయొచ్చా లేదా, అనే దానిపైన లీగల్ ఒపినియన్ పోలీసులు తీసుకోవాలి, పోలీసు లీగల్ ఒపినియన్ తీసుకున్న తర్వాత మాత్రమే కేస నమోదు చేయాలి, మూడు ఎటువంటి ఆధారాలు లేవు అనుకుంటే ఇమ్మీడియట్ గా కేసుని క్లోజ్ చేయాలి. ఎవరి ఒత్తిడులకు లొంగాల్సిన అవసరం లేదు. ఈ కీలకమైన మూడు అంశాలని పాటించాల్సిన అవసరం ఉంది పోలీసులు అంటూ తెలంగాణ హైకోర్టు చెప్పింది. ఇది పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించిన అంశం అని చెప్పింది. ఈ దేశంలో మొత్తం మీడియా ఫోర్త్ పిల్లర్ అంతా కూడా, బేస్ చేసుకొని నడుస్తుంది, 191ఏ ఆర్టికల్ భావ ప్రకటన స్వేచ్ఛను బేస్ చేసుకొని మాత్రమే. పత్రికలకు, మీడియాకు జర్నలిస్టులకు ప్రత్యేక ప్రత్యేకమైన హక్కులవి రాజ్యాంగం కల్పించలేదు, ఒక భారత పౌరుడికి ఉండే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ, దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ఫోర్త్ పిల్లర్ నడుస్తోంది. ఫోర్త్ పిల్లర్ జర్నలిజం, జర్నలిస్టులు ఇదంతా మొత్తం నడుస్తుంది అంటే భావ ప్రకటన స్వేచ్ఛను బేస్ చేసుకొని మాత్రమే. అదే భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉంటుంది. ప్రతి పౌరుడు తన భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారం ఒక పోస్ట్ పెట్టినా, ఒక వీడియో చేసినా, ఒక రెస్పాన్స్ ఇచ్చినా దానిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సినంత అవసరం ఎందుకు వస్తుంది. ఇది ప్రభుత్వాల వైపు నుంచి, ప్రభుత్వాలు అధికారికంగా కేసులు పెట్టి, పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కేసులు వాదించే పరిస్థితికి వస్తున్నారు. ఇది పౌరులకు సంబంధించిన భావ ప్రకటన స్వేచ్ఛని అడ్డుకునే ప్రయత్నం, అది లేకుండా చేసే ప్రయత్నం అంటూ కోర్టు అభిప్రాయపడింది. దీని పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకి వెళ్ళింది. ఓ సోషల్ మీడియా కార్యకర్త పైన మేము కేసు పెడితే, కేసు నమోదు చేయకుండా, కోర్టు ఆపింది, పైగా ఇటువంటి ఆదేశాలు ఇచ్చింది, ఈ ఆదేశాలు లేకుండా చేయండి, హైకోర్టు ఇచ్చిన ఈ మూడు కీలకమైన ఆదేశాలను ఆపించేసేయండి, లేదా సస్పెండ్ చేసేయండి, అంటూ సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. సుప్రీం కోర్టుని ఆశ్రయించడం మాత్రమే కాదు, సుప్రీం కోర్టులో టాప్ 10 అడ్వకేట్స్ గా ఉన్న హై పెయిడ్ అడ్వకేట్ గా ఉన్న, చంద్రబాబు నాయుడు గారికి, బాగా సన్నిహితుడిగా ఉన్న, సిద్ధార్థ లూథ్రూని ఈ కేసుని వాదించడానికి సుప్రీం కోర్టులో నియమించుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సిద్ధార్థ లూథ్రూ ఈ అంశం పైన సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని లేకుండా చేయండి, ఆ ఆదేశాలు సరైనవి కాదు, ఆ ఆదేశాలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి, కైండ్ ఆఫ్ ఆర్మెంట్ సుప్రీం కోర్టులో చేశారు, అయినప్పటికీ ఈ ఆదేశాల అమలు కావాల్సిన అవసరం ఉంది, మిస్టర్ సిద్ధార్థ లూథ్రూ నువ్వు చేస్తున్న వాదన సరైనది కాదు, ఇటువంటి ఆదేశాల కోసం అనేక కోర్టులు దేశవ్యాప్తంగా ఎదురుచూస్తూ ఉన్నాయి, సోషల్ మీడియా లో రెస్పాండ్ అవుతున్న వాళ్ళపైన ఉక్కుమాదం మోపాలనే ప్రభుత్వాల ఆలోచన సరైనది కాదు, కాబట్టి ఇటువంటి వాదనలు మీరు చేయకండి, అని చెప్పింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని ఇంప్లిమెంట్ చేయాల్సిందే, దాంట్లో ఏమాత్రం కూడా తప్పు లేదు, అనే విషయాన్ని సుప్రీం కోర్ట్ చెప్పింది. ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 'YNR' విశ్లేషణలో..!