ఓ మహిళకు పెళ్లయింది. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చక్కగా సాగుతున్న సంసారంలో వివాహేతర సంబంధం నిప్పులు పోసుకుంది.

ఓ మహిళకు పెళ్లయింది. ఇద్దరు కూతుర్లు ఉన్నారు. చక్కగా సాగుతున్న సంసారంలో వివాహేతర సంబంధం నిప్పులు పోసుకుంది. ఎదురింట్లో ఉండే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడితో కలిసి భార్య.. భర్తను హత్య చేయించిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. మూడేళ్ల కూతురు చెప్పిన వివరాలతో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వేలూరు జిల్లా ఒడుకత్తూర్‌ వద్ద కుప్పంపాళ్యానికి చెందిన భారత్ చెన్నైలో ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఐదేళ్ల కిందట బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల నందినితో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు నాలుగు, మూడేళ్ల వయసున్న ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వీకెండ్‌ సెలవుల్లో భార్యాపిల్లలను చూసేందుకు భారత్‌ ఇంటికొస్తుంటాడు. ఈ క్రమంలో ఈనెల 21న ఇంటికొచ్చిన భారత్.. కిరాణా సరుకుల కోసం బైక్‌పై షాపుకు వెళ్తాడు. తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న కొబ్బరి మట్టలను దాటే క్రమంలో కిందపడిపోవడంతో అక్కడ దాక్కున్న వ్యక్తి వచ్చి అతనిపై దాడి చేసి పారిపోవడంతో బాధితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. విచారణలో భార్య నందిని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు లోతుగా విచారించారు.భారత్‌ చిన్న కుమార్తెను ఆరా తీయగా.. మూడేళ్ల చిన్నారిని పోలీసులు అడిగారు. తన ఇంటి ఎదురుగా ఉండే సంజయ్ మామ తండ్రిని కొట్టి చంపి పారిపోయాడని తెలిపాడు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. వెంటనే నందినితోపాటు సంజయ్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ehatv

ehatv

Next Story