కరీంనగర్ జిల్లా ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థులు పాడిన దివ్య దృష్టి వీడియో ఆల్బమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తమ నివాసంలో ఆవిష్కరించారు.

కరీంనగర్ జిల్లా ప్రభుత్వ అంధుల పాఠశాల విద్యార్థులు పాడిన దివ్య దృష్టి వీడియో ఆల్బమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని తమ నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పిల్లలు దివ్య దృష్టి గల. సుదీర్ఘమైన సంస్కృత సమాసాలతో ఉన్న స్తోత్రాలను కూడా అలవోకగా పడడం అభినందనీయమని, భాష సరిగా ఉచ్చరించలేని ఈ కాలంలో ఇంత స్పష్టంగా రాగయుక్తంగా స్తోత్రాలను ఆలపించడం ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఎంతో కృషి అభ్యాసం ఉంటే తప్ప ఇది సాధించలేరని, చిన్నారులు వృద్ధిలోకి రావాలని ఆశీర్వదించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి విద్యారంగంలో చిన్నారులను ప్రోత్సహించడం ఆదర్శణీయమని అన్నారు. వీడియో ఆల్బమ్ కు దర్శకత్వం వహించిన నంది శ్రీనివాస్, సంగీతాన్ని అందించిన కె. బి. శర్మ, సంగీత ఉపాధ్యాయురాలు సరళ, వీడియోగ్రఫీ చేసిన లక్ష్మీ గౌతమ్ లను అభినందించారు. కరీంనగర్ ఫిలిం సొసైటీ అధ్యక్షులు అన్నం రవిచంద్ర గారి సమన్వయంతో సాగిన ఈ కార్యక్రమంలో చిన్నారి గాయకులు సింధుశ్రీ, శ్రావణి, తిరుమల, అఖిల, నిత్యశ్రీ, జాహ్నవి, కల్పన, ప్రణయ్, సాయిరామ్, మణిదీప్, అక్షయ్, వరుణ్ తేజ్, మణి రతన్, లోహిత్ లతో పాటు ప్రభుత్వ బదిరుల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా బస్సు ఏర్పాటుచేసి పిల్లలను కరీంనగర్ నుండి హైదరాబాద్ రప్పించి ముఖ్యమంత్రి గారిచే వీడియో ఆల్బమ్ ఆవిష్కరణ చేయించారు. కార్యక్రమ అనంతరం కలెక్టర్ పమేలా సత్పతి గారు పిల్లలతో కలిసి సచివాలయం సందర్శించారు.
