ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. అడ్డుగా ఉన్నాడని భర్తను చంపింది ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.

ప్రభుత్వ ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని.. అడ్డుగా ఉన్నాడని భర్తను చంపింది ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మారుతీనగర్ కాలనీలో భార్యాభర్తలు లక్ష్మణ్ నాయక్(38), పద్మ(30) నివాసం ఉంటున్నారు. 2024లో డీఎస్సీలో ఎంపికై ఉప్పునుంతల మండలం బట్టుకాడిపల్లి తండా ప్రాథమిక పాఠశాలలో పద్మ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. గత నెల 25న లక్ష్మణ్ నాయక్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. పోలీసులకు అతని తమ్ముడు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పద్మకు, తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో పని చేస్తున్న రాత్లావత్ గోపి అనే ఉపాధ్యాయుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను చంపాలని.. గత నెల 24న రాత్రి పడుకొని ఉన్న లక్ష్మణ్ నాయక్ ముక్కు, నోటిపై గుడ్డతో మూసి ఊపిరాడకుండా చేసి పద్మ, గోపి చంపారు. మర్నాడు ఉదయం ఏమి తెలియనట్లు పాఠశాలకు వెళ్ళి, ఇంటి యజమానికి ఫోన్ చేసి, తన భర్త ఎంత ఫోన్ చేసినా ఎత్తడం లేదని, తనకు భయంగా ఉందని, కొంచెం చూడండని పద్మ నటించింది. తాను ఇంటికి రాగానే ఇంట్లో భర్త చనిపోయి ఉన్నాడని పద్మ నమ్మించగా.. పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి తమ్ముడు. తమదైన శైలిలో విచారణ జరిపి, వివాహేతర సంబంధం వల్లే హత్య జరిగిందని వాస్తవాలను తేల్చారు. పద్మ, గోపిలను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Updated On
ehatv

ehatv

Next Story