పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అశోక్ నగర్‌లో వివాహేతర సంబంధం కారణంగా చోటుచేసుకున్న ఒక సంఘటన

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అశోక్ నగర్‌లో వివాహేతర సంబంధం కారణంగా చోటుచేసుకున్న ఒక సంఘటన స్థానికులలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. ఫేస్‌బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధంగా మారడంతో, స్థానికులు ఆగ్రహించి ఇద్దరినీ తాడుతో కట్టి, యువకుడికి "దేహ శుద్ధి" చేసి, వారిని పోలీసులకు అప్పగించారు.

సుల్తానాబాద్‌(Sultanabad)లోని అశోక్ నగర్‌కు చెందిన మౌనిక(Mounika) అనే వివాహిత ఫేస్‌బుక్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన స్వామి (Swamy)అనే యువకుడితో పరిచయం ఏర్పరచుకుంది. ఈ పరిచయం క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. గత మూడు రోజులుగా స్వామి మౌనిక ఇంట్లో ఉండడం స్థానికుల దృష్టికి రావడంతో, వారు ఆగ్రహానికి గురై ఇద్దరినీ తాడుతో కట్టి, యువకుడిని శారీరకంగా శిక్షించారు. ఆ తర్వాత, ఇద్దరినీ సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

ehatv

ehatv

Next Story