Government's key orders on the Musi: మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వం కీలక ఆదేశాలు.. ఇక వాళ్లు ఖాళీ చేయాల్సిందేనా..!

ముసీ ప్రాజెక్టు సుందరీకరణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 55 కిలోమీటర్ల మేర మూసిని అభివృద్ధి చేసేందుకు మొత్తం 3,279 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భూమితో పాటు 10,017 ప్రైవేట్‌ ప్రాపర్టీలు సేకరించనుంది. ఈ మేరకు ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉంటున్నవారు ఆందోళన చెందుతున్నారు. వారికి సరైన నష్టపరిహారం ఇచ్చి భూసేకరణ మరియు ఆస్తులను తీసుకుంటుందా లేదా అనే మిమాంస నెలకొంది. ప్రభుత్వ నోటిఫికేషన్‌తో మరోసారి మూసి 'ప్రళయమే' చూసేలా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో అన్న సందిగ్దత నెలకొంది. మరోవైపు మూసీ బాధితులు ఈరోజే ప్రెస్‌ క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి మా ఇళ్లను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చే పరిస్థితి లేదని తేల్చిచెప్తున్నారు.

Updated On
ehatv

ehatv

Next Story