వరంగల్ (Warangal)జిల్లా శాయంపేట మండలం ఆరేపల్లి (Arepalli)గ్రామానికి చెందిన మణిరాజ్ (Maniraj)అనే యువకుడు, నితీష (Nithisha)అనే యువతితో వారం రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

వరంగల్ (Warangal)జిల్లా శాయంపేట మండలం ఆరేపల్లి (Arepalli)గ్రామానికి చెందిన మణిరాజ్ (Maniraj)అనే యువకుడు, నితీష (Nithisha)అనే యువతితో వారం రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలో సముద్రాల బాలరాజు(Samudrala balaraju) అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి బంధువులు, సుమారు 50 మంది శనిగరం (Sanigaram)గ్రామానికి చేరుకుని గొడవ సృష్టించారు. స్థానికులు అడ్డుకోవడంతో, ప్రేమ జంట రక్షణ కోసం నల్లబెల్లి పోలీస్ స్టేషన్(Nallabelli Police Station)ను ఆశ్రయించింది. పోలీస్ స్టేషన్లో యువతి కుటుంబ సభ్యులు, యువకుడి బంధువులతో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తుండగా, యువతి బంధువులు స్టేషన్లోకి చొచ్చుకొని వచ్చి ప్రేమ జంటపై దాడి చేశారు. యువతిని బలవంతంగా ఈడ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు, దీంతో ఆవరణలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వెంటనే జోక్యం చేసుకొని జంటను రక్షించి, దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు
