పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లురి లక్ష్మణ్ కుమార్ ల భేటీ.

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లురి లక్ష్మణ్ కుమార్ ల భేటీ. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ చొరవతో మంత్రులు మధ్య ముగిసిన వివాదం. మంత్రుల మధ్య పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ,ఇతర ముఖ్య నేతలు సయోధ్య కుదిర్చినట్లు తెలుస్తోంది. సమావేశంలో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి,ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్,కవ్వంపల్లి సత్యనారాయణ,శివసేన రెడ్డి ,సంపత్ కుమార్, అనిల్ , వినయ్ కుమార్. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను , మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాకు పార్టీ సంక్షేమం తప్ప ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. తాను ఆ మాట అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం ఆయన బాధ పడిన దానికి తాను క్షమాపణలు కోరుతున్నాని పొన్నం అన్నారు. తనకు అలాంటి ఆలోచన లేదు.. తనను ఆ ఒరవడిలో పెరగలేదని పొన్నం అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు ఆ సంస్కృతి నేర్పలేదని.. సామాజిక న్యాయానికి పోరాడే సందర్భంలో వ్యక్తిగత అంశాలు పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయంలో బలహీనవర్గాల బిడ్డగా ఈరోజు రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు 42 శాతం రిజర్వేషన్లకు పోరాటం జరుగుతుందన్నారు. తామంతా ఐక్యంగా భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పని చేస్తామని.. లక్ష్మణ్కు వ్యక్తిగతంగా క్షమాపణలు చెప్తున్నానని.. కరీంనగర్లో మాదిగ సామాజిక వర్గంతో కలిసి పెరిగామని మంత్రి పొన్నం అన్నారు.
