స్పా మసుగులో వ్యభిచారం..! ఆన్‌లైన్‌లో పురుషులను ఆకర్షిస్తున్న స్పా సెంటర్..!

కూకట్‌పల్లిలో బ్యూటీ స్పాసెంటర్‌ ముసుగులో వ్యభిచారానికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చార్మ్‌ బ్యూటీ స్పా సెంటర్‌పై దాడి చేసి ఆరుగురు మహిళలను, ఒక విటుడుని, నిర్వాహకులను పట్టుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. భాగ్యనగర్‌ కాలనీలో స్పా సెంటర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారని పక్కా సమాచారం మేరకు కూకట్‌పల్లి పోలీసులు, యాంటి ఉమెన్‌ ట్రాఫిక్‌ సైబరాబాద్‌ టీం ఆధ్వర్యంలో దాడి చేశారు. భాగ్యనగర్‌కాలనీలో చార్మ్‌ బ్యూటీ స్పా సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. అయితే స్పా ముసుగులో విటులను ఆకర్షిస్తున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా విటులను ఆకర్షించి స్పా సెంటర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసుల దాడి చేసి ఆరుగురు మహిళలను, విటుడిని, ముగ్గురు నిర్వాహకులను అరెస్టు చేశారు. 4 స్మార్ట్‌ ఫోన్‌లు, రూ.9100 నగదు స్వా«దీనం చేసుకున్నారు. మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు. జగద్గిరిగుట్టకు చెందిన నిర్వాహకురాలు (31), మలక్‌ పేటకు చెందిన సబ్‌ ఆర్గనైజర్‌ (36)ని, గుంటూరుకు చెందిన జయప్రకాష్‌ (25)లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated On
ehatv

ehatv

Next Story