Seven corporations : తెలంగాణలో ఏడు కార్పొరేషన్లు.. లేటెస్ట్ సర్వే..!

తెలంగాణలో ఏడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈనెల 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి, ఈనెల 13న ఫలితాలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా సర్వేలు వస్తున్నాయి. తాజాగా ఓ టీవీ చానెల్ నిర్వహించిన ఏడు కార్పొరేషన్ల సర్వేలు ఈ విధంగా ఉన్నాయి. నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్కు స్పష్టమైన ఆధిక్యత కనపడుతోంది. నల్గొండలో మొత్తం 48 డివిజన్లు ఉండగా కాంగ్రెస్కు 30-32 డివిజన్లు, బీఆర్ఎస్కు 8-10 డివిజన్లు, బీజేపీ 0-4, ఎంఐఎం 0-2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వే వెల్లడైంది. అదేవిధంగా కొత్తగూడెంలో కాంగ్రెస్కు 33-35 స్థానాలు, బీఆర్ఎస్కు 10-11 స్థానాలు, సీపీఐకి 8-10 స్థానాలు, ఇతరులు 4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. మహబూబ్నగర్లో 60 డివిజన్లు ఉండగా, కాంగ్రెస్కు 30-35 స్థానాలు, బీఆర్ఎస్కు 10-12 స్థానాలు, బీజేపీ 7-8 స్థానాలు, ఇతరులు 0-4 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇక మరో కార్పొరేషన్లో కరీంనగర్లో 66 డివిజన్లు ఉండగా, బీజేపీకి 25-27 డివిజన్లు, కాంగ్రెస్కు 15-18 స్థానాలు, బీఆర్ఎస్కు 15-16 స్థానాల్లో, ఎంఐఎం 5-7 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వేలో వెల్లడైంది. రామగుండం కార్పొరేషన్లో 30-35 స్థానాలు, బీఆర్ఎస్ 10-14 స్థానాలు, బీజేపీ 0-5 స్థానాలు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 12-15 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. ఇక మంచిర్యాల కార్పొరేషన్లో 42-45 స్థానాలు, బీఆర్ఎస్ 9-10 స్థానాలు, బీజేపీ 0-3 స్థానాలు, ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉండగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతారం ఎత్తనుంది. బీజేపీకి 20-22 స్థానాలు, కాంగ్రెస్ 10-12 స్థానాలు, బీఆర్ఎస్కు 0-5 స్థానాలు, ఎంఐఎం 15-17 స్థానాలు గెలిచే అవకాశం ఉందని సర్వేలో తేలింది.


