Harish Rao on Revanth..! అవును 'KCR' ముమ్మాటికీ 'జాతిపిత'నే.. నువ్వ ఓ పెద్ద 'బూతుపిత'గానివి..! రేవంత్‌కు హరీష్‌రావు చురకలు..!

అవును 'KCR' ముమ్మాటికీ 'జాతిపిత'నే.. నువ్వ ఓ పెద్ద 'బూతుపిత'గానివి..! రేవంత్‌కు హరీష్‌రావు చురకలు అంటించారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ప్రజ్ఞాపూర్‌లో ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిన్న మిర్యాలగూడలో రేవంత్‌రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. త్యాగాలతో, ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు, ముమ్మాటికి తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అయితే.. రేవంత్ రెడ్డి బూతు పిత అని.. తెలంగాణ అభివృద్ధి ప్రధాత కేసీఆర్.. బూతుల ప్రధాత రేవంత్ రెడ్డి అన్నారు. ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేదు.. నీ మొఖానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు.. నువ్వొక చేతగాని దద్దమ్మవు రేవంత్ రెడ్డి, ఇప్పటికే రెండు రైతుబంధులు ఎగ్గొట్టారు.. ఇది మూడోది.. మొత్తం కలిపి ఒక్కసారే వేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కోడ్ అడ్డురాదు.. మేమే ఈసీకి లేఖ ఇస్తాం.. దమ్ముంటే 11లోగా రైతుబంధు వేయాలని, 11లోగా రైతుబంధు వేయకపోతే కాంగ్రెస్ పార్టీని రైతులు చీల్చి చెండాడతారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్‌లో మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు పర్యటించి, భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ గారి అభివృద్ధిని, రేవంత్ రెడ్డి వైఫల్యాలను ఎండగట్టారు. గజ్వేల్‌లో ఎన్నికలు వచ్చాయి. మనకు అన్నం పెట్టిన వాళ్లకు, మనకు పని చేసిన వాళ్లకు, మనల్ని మంచిగా చూసుకున్న వాళ్లకే ఓటేయాలన్నారు. సద్ది తిన్న రేవు తలవాలి. గజ్వేల్ అభివృద్ధి ప్రధాత కేసీఆర్ గారు. గజ్వేలులో బీఆర్ఎస్ ను మళ్ళీ గెలిపించుకోవాలని కోరారు. కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే? ఇప్పుడు ఎట్లుందో ఆలోచించాలన్నారు. ప్రజ్ఞాపూర్-గజ్వేల్ రోడ్డు అప్పుడు ఎట్లుండే, ఆరోజు గజ్వేల్ దవాఖాన పందులకు నిలయంగా ఉండేది. ఈరోజు 250 పడకల ఆసుపత్రి తెచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించింది కేసీఆర్ అని అన్నారు. గజ్వేల్‌కు ఆర్డీవో ఆఫీస్, రైలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఊర చెరువు, పాండవుల చెరువు సుందరీకరణ చేసింది కేసీఆర్ కాదా.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 1,00,116 అందించి మేనమామలా ఆదుకున్నది కేసీఆరే కదా అని హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవిస్తే కేసీఆర్ కిట్‌తో పాటు 13,000 అందించిన ఘనత కేసీఆర్‌ది, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ బిడ్డల కోసం గురుకులాలు స్థాపించి చదువుల విప్లవం తెచ్చింది కేసీఆర్, ఒకప్పుడు గజ్వేల్‌లో మూడు రోజులకోసారి నీళ్లు వచ్చే పరిస్థితి పోయి.. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీళ్లు అందించారు. బిందెలు పట్టే కష్టం లేకుండా చేసి, మహిళల కష్టాలు తీర్చింది కేసీఆర్. అన్నారు.

రైతుబంధు ఎందుకు వేయలేదు అంటే ఎలక్షన్ అయ్యాక ఇస్తా అంటున్నాడు రేవంత్. కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ 11 సార్లు రైతుబంధు ఆపలేదు. ఇంటింటికీ బియ్యం, మందులు పంపారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చాక ఇప్పటికి రెండు రైతుబంధులు ఎగ్గొట్టిండని దుయ్యబట్టారు.

ఇది మూడోది. ఎగ్గొట్టిన రెండు, ఇప్పుడు రావాల్సిన ఒకటి.. కలిపి మూడు రైతుబంధులు వెంటనే వేయాలని డిమాండ్‌ చేశారు. కావాలంటే మేమే ఎలక్షన్ కమిషన్ కు లేఖ ఇస్తాం.. మాకు అభ్యంతరం లేదని. 11వ తేదీలోగా రైతుబంధు వేయకపోతే రైతులు నిన్ను చీల్చి చెండాడతారని హెచ్చరించారు. త్యాగాలతో, ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు, ముమ్మాటికి తెలంగాణ జాతిపిత కేసీఆర్.

రేవంత్ రెడ్డి ఏమో నోరు తెరిస్తే చాలు బూతులు మాట్లాడే బూతుల పిత అని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి.. పెన్షన్ అడిగితే లాగుల తొండలు వదులుతా, హామీలు అడిగితే పేగులు మెడలో వేసుకుంటా అంటాడని, హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి వచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డి బుద్ధి.. కుక్క తోక వంకరే అని ఎద్దేవా చేశారు. 200 ఉన్న పెన్షన్ రూ. 2000 చేసింది కేసీఆర్. రేవంత్ రెడ్డి రూ.4000 ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చి సగం కాలం గడిచినా ఒక్క రూపాయి పెంచలేదని, ఇప్పటివరకు ఒక్కో అవ్వతాతకు రూ. 52,000 ప్రభుత్వం బాకీ పడింది. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామన్నాడు.. ఎవరికైనా వచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు. ఫ్రీ బస్సు అని మగోళ్లకు డబల్ టికెట్ కొట్టి, ఆడవాళ్లకు తిప్పలు పెట్టారన్నారు.

పువ్వు గుర్తు వాళ్ళు ఎన్నడైనా ఒక్క రూపాయి పని చేశారా? అక్షింతలు పంచడం తప్ప ఏమైనా చేశారా? యాదాద్రి నరసింహ స్వామి గుడి కట్టింది కేసీఆర్. గజ్వేల్ వెంకటేశ్వర స్వామి గుడి, రామాలయం, శివాలయం అద్భుతంగా కట్టించింది కేసీఆర్. పని చేసే వాళ్లకు ఓటేద్దామా? అక్షింతలు వేసే వాళ్లకు ఓటేద్దామా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్ గారు ముస్లిం మైనార్టీ పిల్లల చదువు కోసం ఆలోచించి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. షాదీ ముబారక్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చాక మైనార్టీల కోసం ఒక్క రూపాయి పని చేశారా? ఎరువు బస్తాలు ఇచ్చే తెలివి లేదు.. చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్‌ని తిడతావా? నీ మొఖానికి పండిన వడ్లు కొనే తెలివి లేదు. కేసీఆర్ పెట్టిన పథకాలన్నీ బతుకమ్మ చీరలు, గొర్రెలు, చేపలు, దళితబంధు బంద్ పెట్టి రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నావన్నారు. మన తెలంగాణను కాపాడుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలి. ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్లు ఐదేళ్లు ఉంటారు.. రెండేళ్లలో వచ్చేది మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే. ప్రజ్ఞాపూర్ గౌరవం నిలబడాలంటే బీఆర్ఎస్ గెలవాలని హరీష్‌రావు అన్నారు.

Updated On
ehatv

ehatv

Next Story