Mysoor Sri: ఇకపై మైసూరు "పాక్" పేరు మైసూరు "శ్రీ"
Mysoor Sri: ఇకపై మైసూరు "పాక్" పేరు మైసూరు "శ్రీ"
పహల్గం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ దేశంపై భారతీయులంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో మైసూర్ పాక్ పేరు మార్చాలని సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ చేశారు. రాజస్థాన్ జైపూర్లో ప్రముఖ "త్యోహర్ స్వీట్స్" యజమానికి ఈ డిమాండ్ బాగా నచ్చి, తన షాపులో మైసూరు పాక్ పేరును ''మైసూరు శ్రీ'' గా మార్చేశాడు. అతని షాపులో విక్రయించే మోతీ పాక్, ఆమ్ పాక్, గోండ్ పాక్ స్వీట్ పేర్లను సైతం మోతీ శ్రీ,, ఆమ్ శ్రీ,, గోండ్ శ్రీ గా పేర్లను యజమాని మార్చేశాడు. దేశభక్తి కేవలం సరిహద్దులోనే కాదు ప్రతీ పొరుడిలో ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు షాపు యజమాని వెల్లడించాడు. ఇది పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగింది. ‘పాక్’ అనే పదం కన్నడలో తీపి అని అర్థం వచ్చినప్పటికీ, పాకిస్థాన్తో యుద్ధం కారణంగా ఆ పేరు వినడానికి జనం ఇష్టపడటం లేదని, అందుకే మైసూర్ పాక్ని మైసూర్ శ్రీగా, మోతీ పాక్ని మోతీ శ్రీగా ఇలా పేర్లు మార్చినట్లు దుకాణదారుడు చెప్పారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో దేశభక్తులంతా అతడి నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు.