BJP-Laddu Issue: లడ్డు అంశం పట్ల బీజేపీపై చంద్రబాబు అనుమానం..!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన లడ్డు అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు భూమరాంగ్‌గా మారాయి. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా లడ్డుల్లో జంతువుల కొవ్వు కలవలేదు అంటూ సిట్ రిపోర్ట్‌లో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి సమాధానం చెప్పుకోక తప్పని పరిస్థితి కనిపించింది. ఈ అంశం పైన ఎదురుదాడే చేయాలి, ఇక్కడ నుంచి సైలెంట్ గా ఉంటే లాభం లేదనుకుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి హార్పిక్ ఆయిల్ కలిపారు, బాత్‌రూం, టాయిలెట్లు కలిపే కడిగే ఆయిల్‌ను దాంట్లో కలిపారు అంటూ మాట్లాడడం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి అగ్రెసివ్ గా ప్రజల్లోకి వెళ్ళకపోతే, ఈ అంశానికి సంబంధించి అటాక్ చేయకపోతే, మనం తప్పు చేశామనే విషయాన్ని ప్రజలు బలంగా నమ్మే ప్రమాదం ఉంటుంది. అది రాజకీయంగా ఇబ్బంది కలుగుతుంది అని బహుశా కూటమి సర్కార్ అంచనా వేస్తుంది. ముఖ్యమంత్రి అంచనా వేస్తున్నట్లు కనపడుతుంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ వైఖరి పట్ల, భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల అనుమానం పెంచుకుంటోంది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా. భారతీయ జనతా పార్టీని అనుమానంగా చూస్తోంది. భారతీయ జనతా పార్టీ ఎందుకు స్పందించట్లేదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇదే ప్రశ్న వేస్తున్నారు. ఇదే మాట బయటికి మాట్లాడలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయా అంటే, విభేదాలు పెట్టే ప్రయత్నం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుందేమో కానీ, ఆ విభేదాలు ఉన్నాయనే అంశాన్ని అటు తెలుగుదేశం, ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం. నిన్నటికి నిన్న రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ సమక్షంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూశాం. రాష్ట్రంలో కమ్మటి పాలన నడుస్తోంది, అన్ని కులాలని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఈ కూటమే అంటే, భారతీయ జనతా పార్టీనే కారణం, భారతీయ జనతా పార్టీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడేదే కాదు అంటూ, ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలో వ్యాఖ్యలు చేయడం చూశాం. ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీకి ప్రాధాన్యత లేదు లాంటి, ఒక స్మెల్ ని అటువంటి ఒక లీక్ ని, అటువంటి ఒక ఇంప్రెషన్ ని, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇస్తుంటే, భారతీయ జనతా పార్టీ నాయకులు ఇస్తుంటే, భారతీయ జనతా పార్టీ లడ్డు అంశంలో గట్టిగా నిలదీయట్లేదు, లడ్డు అంశంలో గట్టిగా మాట్లాడట్లేదు అంటూ తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. తెలుగుదేశం పార్టీ భావించే మాటలన్నీ, ముందుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా నుంచి బయటికి వస్తాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వాటిని లీకులు ఇస్తుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా ఆ అంశం పైన చర్చలు, డిబేట్లు, వ్యాసాలు, కథనాలు రాస్తుంది. ఆ తర్వాత ప్రజల మూడుని బట్టి తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. 2014లో కలిసి భారతీయ జనతా పార్టీ, టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత, 2019 ఎన్నికల కంటే ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో రహస్యంగా బిజెపి స్నేహం చేస్తుంది అనే ఒక అనుమానాన్ని పెంచుకున్న తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి నుంచి బయటకు వచ్చింది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ పైన పోరాటం చేస్తున్నాం అంటూ ప్రకటించింది. ఆ ఎన్నికలో దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు కూడా లడ్డు అంశం పైన ఇంత జరుగుతుంటే, చంద్రబాబుని చుట్టుముడితే మొత్తం సమస్యలన్నీ చంద్రబాబు తప్పు చేశారు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతుంటే, భారతీయ జనతా పార్టీ స్పందించిన స్పందించాల్సిన స్థాయిలో స్పందించట్లేదు, ఎందుకు హిందువులకు మేమే ఛాంపియన్ అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ, దేశంలో ఎక్కడైనా హిందువులకు వ్యతిరేకంగా ఏదైనా కార్యక్రమం జరిగితే, ఇమ్మిడియట్ గా ఆ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల స్థాయి నుంచి అందరూ స్పందిస్తారు. కానీ లడ్డుకు సంబంధించిన వ్యవహారంలో ఇంత జరుగుతుంటే ఇంత అపచారం జరిగితే, ఇంత ఘోరం జరిగితే ఇంత ద్రోహం జరిగితే ఎందుకు కేంద్ర నాయకత్వం స్పందించట్లేదు. ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు. వాళ్ళు కూడా మాట్లాడాలి కదా, వాళ్ళు మాట్లాడకపోతే ఎలా, వాళ్ళు మాట్లాడకపోతే ఇది అబద్ధం అని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది కదా, వాళ్ళు మాట్లాడకపోతే చంద్రబాబే తప్పు చేశాడని ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది కదా, మేము స్పందించిన స్థాయిలో, మేము రెస్పాండ్ అయిన స్థాయిలో, భారతీయ జనతా పార్టీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనే ఆవేదన బహుశా తెలుగుదేశం పార్టీలో కనబడుతుంది. పూర్తి విశ్లేషణ ఈ కింది వీడియోలో..!

Updated On
ehatv

ehatv

Next Story