High pressure in AP! ఏపీలో బీపీ.! ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతల ఇళ్లపై దాడులు సమర్థనీయమేనా..!
High pressure in AP! ఏపీలో బీపీ.! ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతల ఇళ్లపై దాడులు సమర్థనీయమేనా..!

ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు పరిణామాలు అవాంచనీయంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాంచనీయం కావివి. ఆంధ్రప్రదేశ్లో నాయకుల ఇళ్లపైన దాడి చేసే సంస్కృతి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నాయకుల బూతు భాష చూస్తున్నాం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎవ్వరు యాక్సెప్ట్ చేసేవి కావు, ఆ వ్యాఖ్యల నేపథ్యంలో చెలరేగిన మంటలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, చూస్తున్నాం, అంబటి రాంబాబుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అడ్డగించిన సందర్భంగా, ఆ సమయంలో అంబటి రాంబాబుకి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు, బూతుల దాడి, ప్రతిదాడి జరుగుతున్న సందర్భంలో, ఆయన చంద్రబాబును ఉద్దేశించి కొన్ని అన్ పార్లమెంటరీ పదాలు వాడారు, ఆ పదాలు వాడడాన్ని ఏ ఒక్కరు సహించే పరిస్థితి లేదు, హర్షించే పరిస్థితి లేదు, ఓ సీనియర్ పొలిటీషియన్ గా ఉన్న వ్యక్తి, దాదాపు 60 ఏళ్ల పైగా వయసు ఉన్న వ్యక్తి అటువంటి భాష మాట్లాడడం సరైనదో కాదో అంబటి ఆలోచించుకోవాలి. అయితే ఆ భాష మాట్లాడిన తర్వాత ఒక గంటకో రెండు గంటలకో ఆయన బయటికు వచ్చి విచారం వ్యక్తం చేశారు. తాను చంద్రబాబుని ఉద్దేశించి అనలేదు ఆ మాటలు, అయినప్పటికీ ఆ మాటలు తను అనకుండా ఉండాల్సింది అంటూ అంబటి రాంబాబు మాట్లాడడం చూసాం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు, అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేయడం, నివాసానికి నిప్పు పెట్టడం, పోలీసుల సమక్షంలోనే ఇదంతా జరగడం చూస్తున్నాం, అంబటి రాంబాబు మాట్లాడింది మధ్యాహ్నం అయితే, సాయంత్రం 7:30 గంటల వరకు 9 గంటల వరకు ఇంటి దగ్గర విధ్వంసం కంటిన్యూ అవుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల సమక్షంలో. పోలీసులు అక్కడ ఉండగానే దాడులు జరగడం. వీడియో సాక్ష్యంగా మనం చూసాం. ఈరోజు కొద్దిసేపటి క్రితం. జోగి రమేష్ ఇంటిపైన పెట్రోల్ బాంబులతో దాడి చేయడం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చూసాం. ఇది కూడా పోలీసుల సమక్షంలోనే జరగడం చూసాం. ఇళ్లపైన దాడి చేయడం సరైనది కాదు. అదే సమయంలో ఈ ఇద్దరు నాయకులు చరిత్ర చూసినప్పుడు. ఇద్దరు నాయకులు మాట్లాడిన మాటలు చూసినప్పుడు, వాళ్ళ మాటల్ని సమర్ధించలేని పరిస్థితి కూడా ఉంది. గతంలో జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడికి వెళ్ళారు, ఆయన దాడికి వెళ్ళలేదు, చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదో వినతి పత్రం ఇవ్వడానికి అని చెప్పారు కానీ, చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలతో చంద్రబాబు ఇంటి దగ్గరికి ఆయన వెళ్ళడం, అక్కడ గొడవ కావడం, అప్పుడు చూసాం. ఈ తరహా పరిస్థితి ఆంధ్రప్రదేశ్ కి వాంచనీయం కాదు, ఈవెన్ రాజకీయ పార్టీలకు కూడా వాంచనీయం కాదు, 2019 ఎన్నికల కంటే ముందు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే, కుటుంబంతో సహా తిరుమల దర్శనానికి వస్తే, అమిత్ షా కాన్వాయ్ పైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు, అటాక్ చేయడం చూసాం. ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమి పాలవడం కూడా చూశాం, అదే సమయంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పైన, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం చూసాం, ఆ తర్వాత ఎన్నికలో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓడిపోవడం చూసాం, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి పార్టీ కార్యాలయంలో కూర్చొని, కాన్షియస్ గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన చేసిన కొన్ని వ్యాఖ్యలు, ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి చేయడం చూసాం, సో ఆ దాడి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా మైలేజ్ ని తీసుకురాలేదు, ఆ దాడి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని 2024 ఎన్నికల్లో ఓడిపోయేలా చేసింది, ఆ ఒక్క దాడే కాదు, దాడుల సంస్కృతిని, దాడులు చేయడాన్ని ప్రజలు హర్షించరు. చిత్తూరు జిల్లా పొంగనూరు ప్రాంతంలో రామచంద్ర యాదవ్ అనే ఒక నాయకుడు ఇంటిపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాడి చేయడం విద్వంసం చేయడం చూసాం, అలాగే మాజీ జడ్జ్ రామకృష్ణ ఇంటిపైన కూడా, పొంగనూరు ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు దాడులు చేయడం చూసాం. ఇవన్నీ కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టాన్ని కలిగించాయి 2024 ఎన్నికల్లో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యాలయాల పైన దాడులు కాదు, నేరుగా నాయకులు ఇళ్లపైన దాడులు చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు, దాడులు మాత్రమే కాదు, నిప్పులు పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయారు, నిప్పు పెట్టిన సందర్భంగా ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఉన్నారు, ఏమైనా జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహిస్తే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో విద్వంస పాలన నడిచింది. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత స్వేచ్ఛని ఇచ్చాం, ప్రజలు ఏవైనా మాట్లాడే స్వేచ్ఛని ఇచ్చామంటూ కూటమి సర్కారు చెప్తుంది. ఏంటి స్వేచ్ఛని ఇచ్చారు, ఎవరికి స్వేచ్ఛని ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే పోలీసులు మౌనంగా ఉండమని, మౌనంగా ఉండే స్వేచ్ఛను పోలీసులకు ఇచ్చారా, లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ చేయకుండా లా అండ్ ఆర్డర్ ని వదిలేసి మీరు స్వేచ్ఛగా రోడ్డు మీద నిలబడండి అనే స్వేచ్ఛను ఇచ్చారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరింటిపైన దాడి చేయొచ్చు అనే స్వేచ్ఛను ఇచ్చారా. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


