Liqour Case: లిక్కర్‌ వ్యవహారంలో ఈ ప్రశ్నలకు బదులేది..!

Liqour Case: లిక్కర్‌ వ్యవహారంలో ఈ ప్రశ్నలకు బదులేది..!

By :  ehatv
Update: 2025-05-24 05:55 GMT

ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ వ్యవహారం చుట్టూ రోజూ టీడీపీ మీడియాలో, పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. లిక్కర్‌ వ్యవహారంలో వేలాది కోట్లు తారుమారయ్యాయని.. ఎంత మొత్తం చేతులు మారిందని, ఎలా జరిగిందని, ఎక్కడ నుంచి డబ్బు తెచ్చారని, ఎన్ని కార్లలో డబ్బు వెళ్లిందని, ఎన్ని మెషిన్లు పెట్టి లెక్కించారనే వార్తలు టీడీపీ మీడియా ప్రచురించింది, ప్రసారం చేసింది. సిట్, సీఐడీ కంటే ముందే టీడీపీ మీడియా ఈ విషయాలన్నీ చెప్పేసేంది. ఆయతే ఆల్‌ ఆఫ్‌ సడెన్‌గా సిట్‌ ఏర్పాటు చేశారు. సిట్ విచారణలో భాగంగా కొందరు అధికారులను కూడా సిట్‌ అరెస్ట్ చేసింది. కొందరికి నోటీసులు ఇచ్చి.. విచారణకు పిలిచి.. విచారణకు పిలిచేలోగానే అరెస్ట్ చేశారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో గత సీఎం జగన్‌ భారీగా ముడుపులు కొట్టేశారని ఆరోపణలు చేస్తున్నారు. లిక్కర్‌ రేట్లను విపరీతంగా పెంచేసి, కొన్ని డిస్టలరీలకు మాత్రమే ఆర్డర్‌ ఇచ్చి ముడుపులు తీసుకున్నారని జగన్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఆయా డిస్టిలరీల నుంచే ముడుపులు వసూలు చేయించారని జగన్‌పై స్తూలంగా టీడీపీ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి, ఆ శాఖాధికారుల పాత్ర ఏంటి.. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్‌ 'YNR' విశ్లేషణ..!

Full View

Tags:    

Similar News