బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి పేషిలోని ఉద్యోగుల జీతభత్యాలు అందక ఉద్యోగులు.. పేషి తెరవలేదని కొన్ని మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమ‌ని మంత్రి పేషి(Minister peshi) అధికారులు ఖండించారు. ఈ మేర‌కు మంత్రి పేషి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఉద్యోగులు రోజు మాదిరిగానే విధులకు హాజరవడానికి వచ్చే క్రమంలో జరిగిన ఆలస్యం వల్ల పేషి తెరవడం కొంత సమయం ఆలస్యం అయిన విషయాన్ని..

బీసీ సంక్షేమ, సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి పేషిలోని ఉద్యోగుల జీతభత్యాలు అందక ఉద్యోగులు.. పేషి తెరవలేదని కొన్ని మీడియాలో వచ్చిన కథనాలు అవాస్తవమ‌ని మంత్రి పేషి(Minister peshi) అధికారులు ఖండించారు. ఈ మేర‌కు మంత్రి పేషి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఉద్యోగులు రోజు మాదిరిగానే విధులకు హాజరవడానికి వచ్చే క్రమంలో జరిగిన ఆలస్యం వల్ల పేషి తెరవడం కొంత సమయం ఆలస్యం అయిన విషయాన్ని.. అభూత కల్పనతో కొన్ని మీడియా ఛానల్స్ మంత్రి పేషికి తాళలు అంటూ అవాస్తవాలను ప్రచారం చేశాయని.. పేషిలో పనిచేస్తున్న ముగ్గురు అటెండర్లలో ఇద్దరు వ్యక్తిగత కారణాలతో సెలవులో ఉండటం మిగిలిన ఒక్క అటెండర్ వచ్చే సమయం ఆలస్యం కావడలో పేషి ఆలస్యంగా తెరవడం.. జరిగిన వాస్తవమ‌ని ప్ర‌క‌ట‌న‌లో వివ‌రించింది.

రోజు మాదిరిగానే నేడు పేషిలో ఒఎస్డీ(OCD), పీఆర్ఓలు(PRO), అటెండర్లు తమ విధిలో పాల్గొని.. పేషికి వచ్చే వారి నుండి అభ్యర్థనలు, అర్జీలను అందింపుచుకుంటూ.. వారి విధి నిర్వహణలో ఉన్నారని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. వాస్తవాలను కప్పి పుచ్చి ప్రభుత్వం మీదా బురద జల్లే కార్యక్రమంలో భాగంగా.. కొన్ని మీడియా ఛానల్స్ వాస్తవాలన్ని వక్రీకరించాయ‌ని.. జీతభత్యాలు విషయంలో ఎటువంటి లోటుపాట్లు లేవని.. ప్రజలకు అవాస్తవ సమాచారం ఇచ్చి ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నంలో భాగంగా కొన్ని మీడియా ఛానల్స్ చేసిన పని అని మంత్రి పేషి వార్తను ఖండించింది.

Updated On 12 Jun 2023 11:34 PM GMT
Ehatv

Ehatv

Next Story