ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "తల్లికి వందనం" అనే ముఖ్య పథకాన్ని ప్రారంభించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "తల్లికి వందనం" అనే ముఖ్య పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పాఠశాలలకు (1వ తరగతి నుండి 12వ తరగతి వరకు, ఇంటర్మీడియట్ సహా) పిల్లలను పంపించే అర్హత కలిగిన తల్లులకు ఉన్న వారికీ ప్రతి పిల్లవాడి కోసం సంవత్సరానికి రూ.15,000/- ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయబడుతుంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. ఈ మేర‌కు త‌ల్లికివంద‌నం అర్హ‌త‌ల‌ను ఈ రోజు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. తల్లులను విద్యలో భాగస్వాములను చేసి, విద్యార్థుల ప్రవేశం పెరిగేలా చేయడం మరియు విద్యా ఫలితాలను మెరుగుపరచడమే దీని లక్ష్యం

అర్హత నియమాలు: గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ ఆదాయం రూ.10,000/-కి మించకూడదు. పట్టణాల్లో రూ.12,000/-కి మించకూడదు. కుటుంబంలో కనీసం ఒకరికి రేషన్ (Rice) కార్డు ఉండాలి. వ్యవసాయ భూమి: తడిచెరువు < 3 ఎకరాలు లేదా పొడి భూమి < 10 ఎకరాలు. కార్ వంటివి కలిగి ఉన్న కుటుంబాలు (టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు మినహాయింపు). విద్యుత్ వినియోగం ≤ 300 యూనిట్లు (సగటు). మున్సిపల్ ప్రాపర్టీ 1000 చదరపు అడుగులు మించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులు/పింఛనుదారులు అర్హులు కారు (కొంతమంది మినహాయింపు ఉంది). ఆదాయ పన్ను చెల్లించేవారు అర్హులు కారు. విద్యార్థులకు కనీసం 75% హాజరు అవసరం. తల్లుల ఆధార్-లింక్ అయిన ఖాతాల్లోకి నేరుగా జమ. తల్లులు లేనిపక్షంలో తండ్రి/గార్డియన్ ఖాతాలోకి. అనాథ పిల్లలదైతే డబ్బు జిల్లా కలెక్టర్ ద్వారా. ప్రతి విద్యార్థిపై రూ.15,000/-లో నుంచి రూ.2,000/- ఉపసంహరించి, విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ (ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్), రెసిడెన్షియల్ స్కూల్స్/జూనియర్ కళాశాలలు, క్లాస్ 1 నుండి 12 వరకు. గ్రామ/వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా ప్రదర్శన. ఫిర్యాదులు నమోదు కోసం ఆన్‌లైన్ గ్రీవెన్స్ పోర్టల్.

ehatv

ehatv

Next Story