Tirumala laddu issue: తిరుమల లడ్డు విషయంలో కూటమి ప్రభుత్వానికి, ఎల్లో మీడియాకు మరో షాక్

తిరుమల లడ్డు విషయంలో జంతువుల కొవ్వు కలిశాయి అంటూ కూటమి ప్రభుత్వం మరియు ఆ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే మీడియా చేస్తున్న ప్రచారం వలన తన మతవిశ్వాసం దెబ్బతిన్నందున నష్టపరిహారం చెల్లించాలి అంటూ విజయవాడ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేసిన విజయవాడకు చెందిన చింతా వెంకటేశ్వర్లు. ABN, TV5,MAHA NEWS, ETV, తెలుగుదేశం పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్స్ కు నోటీసులు జారీ చేసిన విజయవాడ కోర్టు. పిటిషనర్ తరపున పిటిషన్ దాఖలు చేసిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్

తిరుమల లడ్డు విషయంలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చార్జిషీట్‌లో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని నిర్ధారించినప్పటికీ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ అసత్య కథనాలు ప్రసరిస్తున్నారు అన్న పిటిషనర్. కూటమి ప్రభుత్వం అధికారికంగా అసత్య ప్రచారాలు చేయిస్తూ కోటానుకోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు అన్న పిటీషనర్. ముఖ్యమంత్రి ,ఉప ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో మంత్రులు అసత్య ప్రచారాలతో తన మత విశ్వాసాలు దెబ్బతీస్తున్నారు అన్న పిటీషనర్

తిరుమల లడ్డు విషయంలో నెల్లూరులో జరుగుతున్న కేసులో తీర్పు వచ్చేంతవరకు జంతువుల కొవ్వు పై ఎటువంటి కథనాలు ప్రచురించకుండా ప్రతివాదులందరిపై ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వవలసిందిగా తన పిటిషన్‌లో కోరిన పిటీషనర్. తన మత విశ్వాసాలు దెబ్బతీసినందున ప్రతివాదులందరూ 20 లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టుని కోరిన పిటిషనర్.

ఈ పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడ సిటీ సివిల్ కోర్టు, తక్షణమే నోటీసులు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు. కోర్టు ఉత్తర్వులు ఇస్తే కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలు ఇకనుంచి అయినా పరిరక్షించబడతాయి అని పిటిషనర్ వాదన. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలతో లడ్డు విషయంలో అసత్యాలు ప్రచారం చేస్తుంది అన్న పిటీషనర్. సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే బాత్రూంలో వాడే రసాయనాలు లడ్డూలో కలిపారంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న పిటిషనర్

తిరుమల లడ్డు పవిత్రతపై కూటమి ప్రభుత్వం రోజుకో రాజకీయ ప్రకటన చేస్తూ కోటానుకోట్ల మంది భక్తుల మనోభావాలు తో పాటుగా తన మనోభావాలు కూడా దెబ్బతీస్తున్నాయి అన్న పిటిషనర్. తక్షణమే కూటమి ప్రభుత్వాన్ని మరియు మీడియాని నియంత్రించే ఉత్తర్వులు ఇవ్వవలసిందిగా కోరిన పిటిషనర్ దీంతో విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది కోర్టు. అన్ని మీడియా సంస్థలకు హైదరాబాద్ మరియు విజయవాడలో ఉన్న హెడ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ ఆఫీస్ టీవీ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసిన కోర్టు

Updated On
ehatv

ehatv

Next Story