AP Govt: హెరిటేజ్‌పై ప్రభుత్వం తత్తరపాటు..!

హెరిటేజ్ అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తత్తరపాటు కనపడుతుంది. ఆందోళన కనపడుతుంది. ఏం చేయాలో అర్థం కానీ పాలుబోని పరిస్థితి కనపడుతుంది. హెరిటేజ్‌,కి ఇందాపూర్ డైరీకి సంబంధాలు ఉన్నాయి. ఇందాపూర్ డైరీ డైరీ ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తుంది. ఇందాపూర్ డైరీ మార్కెట్‌లో నెయ్యి, ఆవు నెయ్యి అమ్ముతున్న ధర కంటే టిటిడికి సప్లై చేస్తున్న ధర మరింత ఎక్కువగా ఉంది. మార్కెట్లో అమ్ముతున్న నెయ్యి సరైనదా, టిటిడికి ఇస్తున్న నెయ్యి సరైనదా, రెండు సరైనవి అయినప్పుడు, రెండు రెండు రకాల రేట్లు ఎందుకు ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేయాల్సి వచ్చినప్పుడు ధర తక్కువగా కదా ఉండాలి. మార్కెట్లో కంటే ధర ఎక్కువగా ఉంది. ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుంది, ఎందుకు ఆ స్థాయిలో అంత ఎక్కువ పెట్టి ఎంక్వైరీ చేస్తున్నారంటే దాంతోపాటు హెరిటేజ్ కి, ఇందాపూర్ కి మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించి హెరిటేజ్ మొఖం చాటేస్తుంది. ఆ విషయాన్ని చెప్పట్లేదు, ఇక్కడ అంతే కాదు, కోర్టుకి వెళ్లి మా గురించి ఎవరు వార్తలు రాయొద్దు, మా గురించి ఎవరు మాట్లాడద్దు అంటూ కోర్టు నుంచి నోటీసులు తీసుకొచ్చి, సోషల్ మీడియాని భయపెట్టే ప్రయత్నం, కంట్రోల్ చేసే ప్రయత్నం హెరిటేజ్ చేస్తుంది. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వంలో ఉన్న తత్తరపాటు ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఈ అంశానికి సంబంధించి, ఇందాపూర్ డైరీ అంశానికి సంబంధించి, శాసన మండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆ ప్రతినిధులు గడిచిన వారం 10 రోజులుగా ఆందోళన చేస్తూ వస్తున్నారు. ఆ అంశం పైన చర్చించాల్సిందేనని ఈ అంశం పైన చర్చించాలంటూ వాయిదా తీర్మానాలు ఇస్తే కంటిన్యూస్ గా మండలి చైర్మన్ వాయిదా తీర్మానాల్ని తిరస్కరిస్తూ వస్తున్నారు వాయిదా తీర్మానాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ పక్ష నేతగా ఉన్న ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్సా సత్యనారాయణ ఇచ్చిన ఆయన నేతృత్వంలో, ఎమ్మెల్సీలు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తీసుకొని, సేమ్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేసి మేము తెలుగుదేశం పార్టీలో చేరుతామని, తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకున్న కొంతమంది ఎమ్మెల్సీలతో వాయిదా తీర్మానాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇప్పించి, వైసీపీ నుంచి ఇద్దరు వాయిదా తీర్మానాలు ఇచ్చారు, దేన్ని తీసుకోవాలో చెప్పండి అంటూ ఎదురుదాడి చేయడం కూడా చూసాం, ఇది కూడా ఒక చీఫ్ టాక్స్ లో భాగం,గా చీఫ్ పాలిటిక్స్ లో భాగంగానే ప్రజలంతా చూస్తున్నారు. ప్రజలకు అర్థం కాలేదని ప్రభుత్వం అనుకుంటే, అంతకంటే అమాయకత్వం ఇంకోటి, ఉండదు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వాయిదా తీర్మానాలు ఇస్తుంది. వారం రోజులుగా సభని జరగనీయకుండా ఈ అంశం పైన చర్చించాలంటూ పట్టుపడుతుంది, అయినా ప్రభుత్వం ఆ అంశం పైన చర్చించేందుకు ముందుకు రావట్లేదు, ఈ అంశం పైన చర్చించాల్సింది ఏంటూంటూ, వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకొని సభలోకి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకున్నారు అంటూ అసలు విషయాన్ని వదిలేసి ఆ విషయం పైన రాద్దాంతం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ YNR విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story