Chandrababu Naidu's cases: చంద్రబాబు నాయుడు కేసుల ముగింపు ప్రక్రియకు బ్రేక్

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కేసు మూసివేత పై ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరైన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఫిర్యాదుదారుడు రామకృష్ణారెడ్డి తరుపున హాజరైన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. 2022వ సంవత్సరంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ విషయంలో అవకతవకలు జరిగాయని 50 పేజీల రిపోర్టు దాఖలు చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఏపీ సీఐడీ. ఏపీ సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పై A1 ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైకోర్టులో మధ్యంతర బెయిల్ వచ్చింది. విచారణను ఎటువంటి ప్రభావితం చేయకుండా ఉండాలి అనే కండిషన్ మీద హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆ తదనంతరం A1 ముద్దాయిగా ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబునాయుడు ఏపీ సిఐడిని ప్రలోభ పరిచారు అని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార బలంతో ఏపీ సిఐడి అధికారులను లోబరుచుకొని ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నారు పిటిషనర్ అన్నారు. 548 పేజీల ఆధారాలతో హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఏపీ సి ఐ డి ఈరోజు ఆధారాలు లేవు అంటూ విచారణ ముగించటం ప్రభావితమే అన్న ఫిర్యాదుదారుడు రామకృష్ణారెడ్డి.

రాష్ట్ర మంత్రిగా ఉన్న నారా లోకేష్ కొన్ని వందల టీవీ డిబేట్లో తమ అధికారంలోకి వస్తే అధికారులను ప్రభావితం చేసి కేసు మూసి వేసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు అన్న కోర్టుకు తెలిపిన ఆళ్ల రామకృష్ణారెడ్డి

ఏపీ సిఐడి పోలీసులు కేసును మూసి వేస్తూ వేసిన చార్జిషీటుపై అభ్యంతరాలు చెప్పాలి ఏసీబీ కోర్టు వ్యాఖ్యానించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి తరుపున ఈరోజు ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్. 2024 లో ఏపీ సిఐడి పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ వివరాలు కానీ 2026లో ఫైల్ చేసిన ఉపసంహరణ ఉత్తర్వులు గాని పిటీషనర్ కు ఇవ్వలేదన్న న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. సిఆర్పిసి సెక్షన్ 173 (2) (I) ప్రకారం పోలీసులు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ప్రతి ఉత్తర్వు ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ ఏ విధమైన డాక్యుమెంట్స్ ఇవ్వలేదు న్యాయవాది జడ శ్రవణ్‌ కుమార్ వాదనలు వినిపించారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకు లోబడి ఫిర్యాదుదారులకు డాక్యుమెంట్స్ ఇవ్వని కారణంగా అభ్యంతరాలు తెలపటానికి రెండు వారాలు సమయం కోరిన న్యాయవాది శ్రవణ్ కుమార్. ఫిర్యాదుదారుడు కోరినట్లుగా ఏపీ సిఐడి పోలీసులు సమాచారం ఇవ్వాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. ఫిర్యాదుదారునికి కావలసిన డాక్యుమెంట్స్ వివరాలు కోర్టులో వెరిఫై చేసుకోవచ్చు అని న్యాయస్థానం తెలిపింది. ఫిర్యాదుదారుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పూర్తిస్థాయి అభ్యంతరాలు తెలపడానికి మార్చి 11 వరకు సమయం ఇచ్చింది కోర్టు. అయితే ప్రభుత్వం తరఫున హాజరైన ఏపీ సిఐడి న్యాయవాది వాదనలు వినిపించారు. విచారణను వీలైనంత త్వరగా ముగించాలి అన్న ప్రభుత్వ న్యాయవాది కోరారు. రామకృష్ణారెడ్డి కోర్టుకు హాజరు కావడంతో చంద్రబాబు నాయుడు కేసుల ముగింపు ప్రక్రియకు బ్రేక్ పడినట్లయింది.

Updated On
ehatv

ehatv

Next Story