Jada Sravan Kumar : ఏపీలో చీకటి పాలన.. వచ్చే ఎన్నికల్లో కూటమికి డిపాజిట్లు కూడా రావు..!
ప్రభుత్వమనేది కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వంలో సంక్షేమం ఇప్పటి వరకు దేశ చరిత్రలో, ఏపీలో చరిత్రలో రూ.2.90 లక్షల కోట్లు డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి వేసిన వ్యక్తి జగన్ తప్ప ఎవరూ లేరు.

ప్రభుత్వమనేది కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వంలో సంక్షేమం ఇప్పటి వరకు దేశ చరిత్రలో, ఏపీలో చరిత్రలో రూ.2.90 లక్షల కోట్లు డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి వేసిన వ్యక్తి జగన్ తప్ప ఎవరూ లేరు. కోవిడ్ (Covid)ఉన్నా కానీ సంక్షేమ పథకాలు ఆగలేదు. జగన్(Ys Jagan) పరిపాలనను మూడేళ్లుగానే మనం చూడాలి. ఈ మూడేళ్లలో 3 లక్షల కోట్లు ఖాతాలకు జమ చేయడం గ్రేట్. మనం జగన్ను అభినందించాలి కానీ.. అభివృద్ధిలో మాత్రం సున్నా. ప్రజలకు కేవలం సంక్షేమ పథకాలకే ఓట్లు వేస్తారనుకుంటే జగన్కు 175 రావాలి. 95 శాతం ఎన్నికలను జగన్ అమలు చేశారు. సంక్షేమం లేకుంటే ఓట్లు రావు అనేది నిజం కాదు. అమరావతి(Amaravathi), చంద్రబాబు(Chandrababu) అరెస్ట్ వంటి, కొందరు నేతల వ్యాఖ్యల వల్ల.. కూటమి క్యాష్ చేసుకుంది. జగన్ ఓటమికి సవాలక్ష కారణాలున్నాయి. జగన్ ప్రభుత్వం అరాచకం చేసిందని, సూపర్ సిక్స్ (Super Six)అమలు చేస్తామని, హామీలు ఇచ్చింది. సూపర్ సిక్స్ హామీలను ప్రజలు నమ్మారు. 600 హామీలు ప్రజల్లోకి తీసుకెళ్లారు. జగన్ ఫెయిల్యూర్స్ను వీళ్లు పాజిటివ్గా తీసుకెళ్లడంతో ప్రజలు నమ్మారు. కట్ చేస్తే 151 సీట్ల నుంచి 11 సీట్లకు, 23 సీట్ల నుంచి 164 సీట్లతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు చేయాలా వద్దా.. జైంభీంరావు అధినేతతో రియాల్టీ చెక్..!
