CM Chandrababu is in Trouble! చంద్రబాబుకు చిక్కులు..!

చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన పైన గతంలో నమోదైన కేసులు వరుసగా ఈ మధ్యకాలంలో ఏసీబీ కోర్టు కొట్టేస్తూ వస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబుపైన అనేక కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో అయిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకి కూడా వెళ్ళవలసి వచ్చింది. అదే కాకుండా అమరావతి ప్రాంతంలో భూసేకరణ అంశానికి సంబంధించి కావచ్చు, భూములు కొనుగోలుకు సంబంధించిన అంశం, ఇన్సైడర్ ట్రేడింగ్ కి సంబంధించిన అంశంలోనూ, అలాగే మద్యం సంబంధించిన అంశంలోనూ, ఫైబర్ నెట్ కి సంబంధించిన అంశంలోనూ కేసులు నమోదయ్యాయి గతంలో. అయితే ఇటీవల ఏసీబీ కోర్టు వరుసగా ఆ కేసులన్నిటిని కూడా కొట్టివేయడం చూస్తున్నాం. ఆ కేసుల్లో గతంలో ఫిర్యాదు చేసిన వాళ్ళంతా, ఈ కేసులు కొట్టివేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం, వాళ్ళంతా కూడా కేసులు కొట్టివేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ, కోర్టు కన్సెంట్ ఇస్తూ ఉండడంతో, ఆ కేసులన్నీ కొట్టేశారు. ఇప్పటికే ఆ అంశానికి సంబంధించి ఫైబర్ నెట్ కేస్ కొట్టేసారు. మద్యం కేసు కొట్టేశారు. స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన కేసుని కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తాజాగా అమరావతిలో భూముల కొనుగోలుకు సంబంధించి ఐఆర్ఆర్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్డు కు సంబంధించిన కేసు, ఈ రెండు కేసులను కూడా ఈ కేసుల్లో ప్రధానంగా కొట్టివేయడానికి సంబంధించి పిటిషనర్ గా ఉన్న ఈ కేసుల్లో, ఫిర్యాదుదారిగా ఉన్న ఆళ్ల రామకృష్ణ రెడ్డికి ఏపీసీఐడీ ఈ కేసు మిస్టేక్ ఆఫ్ ఫాక్ట్ గా ఉంది. దీనిలో ఎటువంటి ఆధారాలు లేవు కాబట్టి, కొట్టేయాలనుకుంటున్నాం అంటూ, ఆయన హాజరై, దీనికి ఆయనకి సంబంధించిన ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అంటూ నోటీసు జారీ చేసింది. గతంలో కొట్టేసిన కేసుల్లో, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన గతంలో కొట్టేసిన కేసుల్లో. ఐఏఎస్ అధికారులు ఫిర్యాదుదారులుగా ఉన్నారు. ఐఏఎస్ అధికారులంతా ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో పని చేస్తున్నారు, వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు హెడ్ ఆఫ్ ద స్టేట్ ఉన్నారు కాబట్టి, ఆ రాష్ట్రంలో పని చేస్తున్న ఐఏఎస్ అధికారులు, ఇప్పుడు హెడ్ ఆఫ్ ద స్టేట్ కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పే పరిస్థితి, ఆయనకి వ్యతిరేకంగా పని చేసే పరిస్థితి ఉండదు కాబట్టి, వాళ్ళఎవరూ కూడా చంద్రబాబుపైన కేసులు కొట్టివేసే అంశానికి సంబంధించి ఎవరూ అడ్డు చెప్పలేదు. అంతేకాదు ఏపీ సీఐడీ కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి అండర్లోనే నడుస్తూ ఉంటుంది. సీఐడీ అలాగే ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో కేసులు కొట్టివేత పరంపర కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ అమరావతి రింగ్ రోడ్ కి సంబంధించిన అంశం, ఇన్నర్ రింగ్ రోడ్ కి సంబంధించిన అంశం, అసైన్మెంట్, అసైన్డ్ భూముల కొనుగోలు అంశానికి సంబంధించిన ఈ కేసు మాత్రం చంద్రబాబుకు చిక్కులు తెచ్చిపెట్టేలా కనపడుతుంది. ఈ కేసులో పిటిషనర్ గా ఉన్న ఆళ్ల రామకృష్ణ రెడ్డి కూడా ఒప్పుకోవాల్సి ఉంటుంది కేసు కొట్టేయాలంటే, కానీ ఆళ్ల రామకృష్ణ రెడ్డి దానికి ఒప్పుకోవట్లేదు, ఆళ్ల రామకృష్ణ రెడ్డి, ఆయన ఈ కేసులు కొట్టివేయడం సరైనది కాదు అని చెప్తున్నారు. కేసులు కొట్టివేయటాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. కేసులు కొట్టివేయటాన్ని సవాలు చేస్తూ కోర్టులో ఫైట్ చేయబోతున్నారు. ఆయన తరపున జడ శ్రవణ్ కుమార్, జై భీమరావు భారత్ పార్టీ అధ్యక్షులు, ఆయన వాదనలు వినిపించబోతున్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ YNR విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story