మార్కెట్‌కు జగన్‌ రాక.. కేంద్రానికి బాబు లేఖ..!

తెలుగు రాష్ట్రాల్లో మిర్చి దారుణంగా పడిపోయింది. గత నాలుగైదుళ్లుగా ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. పెరిగిన ధరల కారణంగా ఎకరానికి మిర్చి పెడితే దాదాపు లక్షన్నర పెట్టుబడి అవుతుంది. దీంతో క్వింటాల్ మిర్చి రూ.20 వేలు ఉంటేనే రైతుకు కాస్తో కూస్తో గిట్టుబాటు అవుతుంది. కానీ రేటు దారుణంగా పడిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఆవేదనతో ఉన్నారు. తెలంగాణలో ఖమ్మం, వరంగల్‌ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం, గుటూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా మిర్చి పండిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఖమ్మం, వరంగల్‌, గుంటూరు మిర్చికి ప్రధాన మార్కెట్లుగా ఉన్నాయి. ఈరోజు ఖమ్మంలో క్వింటా మిర్చి 14500 జెండా పాటగా ఉంది. ఇంకా తక్కువే పలుకుతోంది. 9, 10, 11, 12 వేలుగా పలుకుతోంది. ఖమ్మ మార్కెట్‌కు ప్రతిరోజూ లక్ష బస్తాలు మిర్చి వస్తోంది. అయితే మిర్చి ధర పడిపోవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి గుంటూరు మార్కెట్‌కు వెళ్లారు. గుంటూరులో గుంటూరు ఈరోజు తేజ మిర్చి 12 వేల నుంచి 13,500 వరకు ఉంది. మిర్చి రైతులను పరామర్శించేందుకు జగన్‌ రైతుల వద్దకు వెళ్లగా.. సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. ఆ లేఖలో ఏముంది.. ఇదే అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..



Updated On 21 Feb 2025 4:45 AM GMT
ehatv

ehatv

Next Story