నెల రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడికి పాల్పడిన 19 ఏళ్ల భవన నిర్మాణ కార్మికుడికి స్థానిక కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.

నెల రోజుల క్రితం వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రాయితో దాడికి పాల్పడిన 19 ఏళ్ల భవన నిర్మాణ కార్మికుడికి స్థానిక కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. 50,000 పూచీక‌త్తు స‌మ‌ర్పించాల‌ని కోర్టు స‌తీష్ కుమార్‌ను కోర‌డంతో పాటు ప‌లు ఆంక్షలు కూడా విధించింది. కోర్టు ముందస్తు అనుమతి లేకుండా విజయవాడ వదిలి వెళ్లరాదని ఆదేశించింది.

ఏప్రిల్ 13న సతీష్ అజిత్ సింగ్ నగర్‌లోని వివేకానంద స్కూల్ సెంటర్ సమీపంలో మేమంత సిద్ధం యాత్ర‌లో పాల్గొన్న సీఎం జ‌గ‌న్‌పై రాయితో దాడి చేశాడు. దాడి తరువాత.. ఆ దాడిలో గాయపడిన విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిని ఐపీసీ సెక్షన్ 307 కింద “హత్య ప్రయత్నం”గా పరిగణించిన విజయవాడ పోలీసులు.. అందుకు కార‌కుడైన స‌తీష్‌ను ఏప్రిల్ 18న అరెస్ట్ చేశారు.

Updated On 29 May 2024 7:27 AM GMT
Yagnik

Yagnik

Next Story