CS Jawahar Reddy : జనసేన నేత ఆరోపణలు.. లీగల్ నోటీసులు ఇవ్వనున్న సీఎస్..!
ఇటీవల విశాఖపట్నంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి..

CS who approached the legal department to issue a legal notice on Murthy Yadav’s allegations
ఇటీవల విశాఖపట్నంలో జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి.. ఆయన కుటుంబ సభ్యులు అసైన్డ్ భూములు కొనుగోలు చేశారని మీడియా ముఖంగా పలు మార్లు నిరాధారమైన అవాస్తవ ఆరోపణలు చేసిన నేపధ్యంలో మూర్తి యాదవ్ పై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సీఎస్ జవహర్ రెడ్డి బుధవారం న్యాయ నిపుణులను సంప్రదించడం జరిగిందని సీఎస్ కార్యాలయం ప్రకటనలో తెలిపింది.
గతంలో జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖులపై కూడా వివిధ సందర్భాల్లో ఈ విధమైన ఆరోపణలు చేయడం జరిగింది. ఆయా ఆరోపణలపై న్యాయపరంగా అప్పుడు ఆ ప్రముఖుల తరపున న్యాయ పరంగా ఏవిధమైన చర్యలు తీసుకున్నారో అదే రీతిలో ప్రస్తుతం సీఎస్ పై చేస్తున్న ఆరోపణలపై కూడా న్యాయపరంగా తగిన చర్యలు తీసుకుందామని న్యాయ నిపుణులు సీఎస్ కు వివరించారు. ఈ నిరాధార, అవాస్తవ ఆరోపణలపై విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కు త్వరలో లీగల్ నోటీసు జారీ చేయడం జరుగుతుందని వెలగపూడి సీఎస్ కార్యాలయం ప్రకటనలో తెలిపింది.


