Deputy CM Pawan Kalyan..! దళిత విద్యార్థులపై వివక్ష..! డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హైకోర్టు షాక్..!

పిఠాపురంలో U.కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులపై కుల వివక్ష జరిగిన కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. తమ పిల్లలను స్కూల్ హెడ్ మాస్టర్ మరియు ఇన్చార్జి హెడ్ మాస్టర్ కులం పేరుతో దూషించారని ఫిర్యాదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అని ఎండపల్లి గ్రామానికి చెందిన పాము సుధారాణి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. తమ పిల్లలపై జరిగిన కుల వ్యవక్ష దాడి మీద డిసెంబర్ నెలలో ఫిర్యాదు ఇచ్చినప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అంటూ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన పాము సుధారాణి. రాజకీయ ప్రయోజనాలతో తమ పిల్లలకు జరిగిన అన్యాయాన్ని పోలీసులు రాజీమార్గాల ద్వారా ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు అంటూ పిటిషనర్ ఆరోపించింది. ఈ వ్యాజ్యంపై హైకోర్టులో వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ఈ వ్యాజ్యాన్ని విచారించిన జస్టిస్ వై లక్ష్మణరావు. ఈ కేసును రాజకీయ ప్రయోజనాలతో పోలీసులే రాజీమార్గాల ద్వారా పిటిషనర్లను ఒత్తిడికి గురి చేస్తున్నారన్న న్యాయవాది

జడ శ్రవణ్ కుమార్. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్ మరియు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్‌కు విజ్ఞాపన చేసినా కూడా కేసు నమోదు చేయలేదని న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదించారు. ఈ కేసులో పోలీసులు తరఫున ప్రభుత్వ న్యాయవాది హాజరయ్యారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపామని ఈ కేసు అబద్ధపు కేసుగా నిరూపణ అయిందని న్యాయస్థానానికి తెలిపిన ప్రభుత్వం న్యాయవాది

ఒక వర్గం పిల్లలపై కుల దాడి జరిగిందని రిపోర్టులో స్పష్టంగా ఉన్న ఎందుకు డి.ఎస్.పి స్థాయి అధికారి విచారణ చేయలేదు అంటూ న్యాయవాదిని ప్రశ్నించిన ధర్మాసనం. ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం డి.ఎస్.పి స్థాయి అధికారి విచారణ చేయాల్సి ఉండగా కేవలం ఎస్ఐ చేత విచారణ ఎలా చేయిస్తారు అంటూ ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించిది. భారతీయ సుప్రీంకోర్టు లలిత కుమారి జడ్జిమెంట్ లో చెప్పిన విధంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి తీరాలి అని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తు చేసిన కారణంగా ఆదేశాలు ఇవ్వద్దు అంటూ న్యాయస్థానాన్ని కోరిన ప్రభుత్వ న్యాయవాది. బాధిత తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో ధర్నా చేసి తమ ఇచ్చిన రిపోర్టు ఎఫ్ఐఆర్‌గా రిజిస్టర్ చేయమని అభ్యర్థించిన పోలీసులు నమోదు చేయలేదు అంటూ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చిన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్. ఒక వర్గం పిల్లలపై కుల దాడి జరిగిందని రిపోర్టులో స్పష్టంగా ఉన్నప్పటికీ ఎస్సై స్థాయి అధికారి విచారణ చేయటం చట్టబద్ధం కాదు అంటూ పోలీసులను ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేయవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది.

Updated On
ehatv

ehatv

Next Story