దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండైన శాంతి అనే మ‌హిళా ఉద్యోగురాలిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశారు

దేవాదాయ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేస్తూ సస్పెండైన శాంతి అనే మ‌హిళా ఉద్యోగురాలిపై ఆమె భర్త మదన్ మోహన్ సంచలన ఆరోపణలు చేశారు. తాను విదేశాల్లో ఉన్న సమయంలో ఏపీలో ఉన్న తన భార్య గర్భం దాల్చిందని ఆరోపించాడు. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కారణమని తీవ్రమైన‌ ఆరోపణలు చేశాడు. ఈ విష‌య‌మై శాంతి స్పందించారు.

ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2013 నవంబర్‌లో మా పెళ్లి అయ్యింది. మాకు ఇద్దరు కవల పిల్లలు. 2015 లో మాకు పిల్లలు పుట్టారు. ఆ త‌ర్వాత నేషనల్ ఓవర్ సీస్ స్కాలర్ షిప్ ఇంటర్వ్యూ కి వెళ్ళాం. మదన్ మోహన్ మానిపాటి అప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగి. నన్ను దారుణంగా హింసించాడు. రెండేళ్లు నన్ను దారుణంగా హింసించాడు. 2016లో మేము విడాకులు రాసుకున్నాం. మా గిరిజన సంప్రదాయం ప్రకారం విడాకులు రాసుకున్నాం. 2019లో మదన్ మోహన్ యూఎస్ వెళ్ళిపోయాడు. 2020 లో నాకు ఉద్యోగం వచ్చింది. నేను, న్యాయవాది సుభాష్ ఇద్దరం ఇష్టపడ్డాం. మేము ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. నేను నవమాసాలు మోసి బిడ్డ ను కన్నాను. నేను సుభాష్ ను పెళ్లి చేసుకున్నాక కూడా మదన్ మోహన్ నన్ను వేధించాడు. మదన్ మోహన్, నేను ఇద్దరం కూడా విశాఖపట్నం కోర్టులో విడాకులు తీసుకున్నాం. నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తూ తర్వాత ప్రభుత్వ ఉద్యోగం లో చేరానని వివ‌రించారు.

నేను ఓ గిరిజన మహిళ ని కాబట్టి నన్ను టార్గెట్ చేశారని ఆమె త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఖండించారు. ఎంపీ విజయసాయిరెడ్డిని నేను విశాఖపట్నం లోనే చూశానని.. ఆయనపై దుష్ప్రచారం చెయ్యడం అత్యంత దారుణమ‌న్నారు. ప్రేమ సమాజంకి చెందిన 30 ఎకరాల భూములు సాయి ప్రియ రిసార్ట్స్ తక్కువ ధరకు లీజు తీసుకున్నారు. దాన్ని తనిఖీ చేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచాను. నేను విజయసాయిరెడ్డితో కేవలం డిపార్ట్ మెంటల్ విషయాలే మాట్లాడాను. ఏ ఆఫీసర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడకూడదా..? అని ఫైర్ అయ్యారు.

ఆంధ్రజ్యోతిలో 100 కోట్లు సంపాదించాను అని రాశారు. అందుకు మదన్ మోహన్ నన్ను 75 కోట్లు అడిగారన్నారు. నేను గిరిజన మహిళ ని అని కక్ష గట్టి నన్ను సస్పెండ్ చేశారన్నారు. నా మీద పెట్టిన చార్జెస్ లో 8 అసలు నాకు సంబంధించినవే కాదన్నారు. నాకు ఇద్దరు అడబిడ్డలు ఉన్నారు. నా వక్తిత్వ హననం చేశారు. నా అడబిడ్డలకు భవిష్యత్ లో పెళ్లి ఎలా చేయాలన్నారు. మదన్ మోహన్ 2016 లో నాకు విడాకుల ఒప్పంద పత్రం రాసి ఇచ్చాడు. 2016 నుండి నేను మదన్ మోహన్ తో సంసారం చెయ్యలేదు. రూ. 30 కోట్లు కావాలని న‌న్ను మదన్ మోహన్ డిమాండ్ చేసేవాడన్నారు. మీడియా నా బిడ్డను అక్రమ సంతానం అనడం దారుణం అన్నారు.

నేను ఇప్పుడు సుభాష్ తోనే ఉన్నాను.. మాకు బిడ్డ పుట్టాడు. అడ్వకేట్ దగ్గర మేము ఎంఓయూ రాసుకున్నప్పుడు మదన్ మోహన్ ఆ బిడ్డ నా బిడ్డ కాదని లిఖితపూర్వకంగా కూడా రాశాడని వివ‌రించారు. నన్ను వేధించినప్పుడు నేను మదన్ మోహన్ పై కేసు కూడా పెట్టానని తెలిపారు. మదన్ మోహన్ అమెరికా అక్రమంగా వెళ్ళాడు. మదన్ మోహన్ మీద కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానన్నారు. నేను గర్భిణీ గా ఉన్నప్పుడు కూడా నన్ను కొట్టేవాడు. నేను చచ్చిపోతే నా చావుకి ఈ ఆరోపణలు చేసినవాళ్లే కారణం అవుతారని వాపోయారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story