సింహాచలం దేవస్థానం ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి(Raghuveera Reddy). ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు.

సింహాచలం దేవస్థానం ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి(Raghuveera Reddy). ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు. తన ఎక్స్‌ ఖాతాలో..''సింహాచలం అప్పన్న స్వామి(Appanna Swamy) చందనోత్సవం సందర్భంగా గోడ కూలి భక్తులు మరణించిన ఘటన తీవ్ర ఆవేదన కలిగించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలన భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. గాయపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను''. కాగా భారీ వర్షాల కారణంగా సింహాచలం దేవస్థానం(Simhachalam Temple)లో సిమెంట్ గోడ కూలిపోయింది. ఈ ఘటనలో రూ. 300 క్యూ లైన్‌లో స్వామివారి నిజరూప దర్శనం కోసం వేచి ఉన్న భక్తులపై గోడ పడటంతో 8 మంది భక్తులు మృతి చెందారు. మృతుల్లో పురుషులు, మహిళలు ఉన్నారు, కొందరు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఆరు మృతదేహాలు లభ్యమైనట్లు, మరో రెండు శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. సహాయక చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Updated On 30 April 2025 5:10 AM GMT
ehatv

ehatv

Next Story