తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు మరో అద్భుతమైన సేవను అందించేందుకు సిద్ధమైంది.

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవేంకటేశ్వర స్వామి భక్తులకు మరో అద్భుతమైన సేవను అందించేందుకు సిద్ధమైంది. మహిళల భక్తి యాత్రను మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా చేసే ఉద్దేశంతో, తిరుమలలో మహిళలకు ఉచిత బస్సు(Free Bus) ప్రయాణ సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం తొలి దశలో 150 బస్సులతో ప్రారంభమవుతుందని టీటీడీ అధికారులు ప్రకటించారు.

తిరుమల గిరులపై వివిధ ప్రాంతాలకు ప్రయాణించే మహిళా భక్తులకు ఈ ఉచిత బస్సు సేవలు గొప్ప వరంగా ఉంటాయి. ఈ పథకం ద్వారా మహిళలు సురక్షితంగా, ఆర్థిక భారం లేకుండా తమ యాత్రను పూర్తి చేసుకోవచ్చు. భక్తుల సౌకర్యం, భద్రత కోసం టీటీడీ ఎల్లప్పుడూ కృషి చేస్తోంది, మరియు ఈ కొత్త సేవ కూడా ఆ దిశలో ఒక ముందడుగు.

ehatv

ehatv

Next Story