గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల బాలికల హాస్టల్‌లోని వాష్‌రూమ్‌లో

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల బాలికల హాస్టల్‌లోని వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాల ఆరోపణలపై స్పందించిన కృష్ణా జిల్లా పోలీసులు సమగ్ర విచారణ కోసం న్యూఢిల్లీ నుండి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT)ని నియమించారు. కృష్ణా జిల్లా పోలీసులు కళాశాల విద్యార్థులను గురువారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య కళాశాలలో సిఇఆర్‌టి సిబ్బందిని కలవాలని, ఏవైనా ఆందోళనలు ఉంటే లేదా కేసుకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని కోరారు.

ఈ సంఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా పరిగణలోకి తీసుకుంది. మహిళల భద్రత, గౌరవ హక్కుపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తూ, కమిషన్ ఏపీ సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. మీడియా కథనాలలోని అంశాలు నిజమైతే, మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యను లేవనెత్తుతుందని కమిషన్ పేర్కొంది. ఈ వ్యవహారంపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సీఎస్, డీజీపీకి నోటీసులు జారీ చేస్తున్నామని ఎన్హెచ్ఆర్సీ తెలిపింది. రెండు వారాల్లోగా అధికారుల నుంచి స్పందన రావాలని ఆదేశించింది.


Updated On
Sreedhar Rao

Sreedhar Rao

Next Story