గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్‌(Srinivasa Ladies Hostel)లో బాత్‌రూమ్ కారిడార్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు విద్యార్థినులు ఆరోపించారు.

గుంటూరు బ్రాడీపేటలోని శ్రీనివాస లేడీస్ హాస్టల్‌(Srinivasa Ladies Hostel)లో బాత్‌రూమ్ కారిడార్ వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు విద్యార్థినులు ఆరోపించారు. వారు హాస్టల్ నిర్వాహకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు, నిర్వాహకులు అసభ్య సందేశాలు పంపడం, అర్ధరాత్రి అబ్బాయిలను హాస్టల్‌లోకి అనుమతించడం వంటి ఆరోపణలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిర్వాహకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. హాస్టల్ నిర్వాహకులు విద్యార్థినులతో అసభ్యకరమైన సందేశాలు పంపడం, ఫోన్‌లో అనుచితంగా మాట్లాడడం చేసినట్లు ఆరోపణలు. అర్ధరాత్రి సమయంలో బయటి వ్యక్తులు, ముఖ్యంగా అబ్బాయిలను హాస్టల్‌లోకి అనుమతించడం జరిగిందని విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల ఫిర్యాదు మేరకు అరండల్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. హాస్టల్ నిర్వహిస్తున్న దంపతులను గుంటూరు(Guntur) వెస్ట్ డీఎస్పీ అరవింద్(Dsp Aravind) అదుపులోకి తీసుకున్నారు. ఒక విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించినట్లు కూడా ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ సంఘటన విద్యార్థినుల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. హాస్టల్ నిర్వాహకులను నిలదీసి, భద్రతా చర్యలు లేనందున ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ విద్యార్థినులకు విద్యార్థి, మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

Updated On
ehatv

ehatv

Next Story