wife stabbed to death: TV సౌండ్ తగ్గించమన్న భర్త.. కత్తితో పొడిచి చంపిన భార్య

ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో కుటుంబ కలహాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. టీవీ సౌండ్ తగ్గించాలని కోరిన భర్త, ఈ విషయంపై జరిగిన వాగ్వాదం చివరికి హత్యకు దారితీసింది.

పోలీసుల సమాచారం ప్రకారం, పెదవడ్లపూడికి చెందిన షేక్ అహ్మద్ (26) ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం క్రాంతి అనే మహిళతో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. అనంతరం ఇద్దరూ పెళ్లి చేసుకుని కలిసి నివసిస్తున్నారు. క్రాంతికి గతంలోనే వివాహం కాగా, ఆమె భర్త ఓ నేరంలో జైలులో ఉన్నాడు. ఆ తరువాత షేక్ అహ్మద్‌ను రెండో వివాహం చేసుకుంది.

గురువారం రాత్రి ఇంట్లో టీవీ సౌండ్ తగ్గించమన్న అహ్మద్‌తో క్రాంతికి వాగ్వాదం జరిగింది. ఆగ్రహంతో కత్తితో అహ్మద్‌ను క్రాంతి పొడిచింది. దీంతో తీవ్రంగా గాయపడిన అహ్మద్‌ను ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితురాలు క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Updated On
ehatv

ehatv

Next Story