మా వద్ద ఉన్న చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయంటూ మాయ మాటలు చెప్పి

మా వద్ద ఉన్న చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయంటూ మాయ మాటలు చెప్పి, హైదరాబాద్‌కు చెందిన వైద్యురాలిని మోసం చేసిన ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు. హైదరాబాద్‌కు చెందిన ప్రియంక అనే వైద్యురాలిని, మహిమగల చెంబు పేరుతో మోసం చేసిన విశాఖపట్నం అరకులోయకు చెందిన పెందుర్తి శ్రీనివాస్, వనుము శ్రీనివాస్, కొర్రా బంగార్రాజు అనే వ్యక్తులు. తమ వద్ద రూ.30 కోట్లు విలువ చేసే మహిమగల చెంబు ఉందని, అందులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని వైద్యురాలిని నమ్మించి రూ.1.50 కోట్లు వసూలు చేసిన నిందితులు. ఆరు నెలల గడుస్తున్నా వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో, మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రియాంక

నిందితులను అదుపులోకి తీసుకుని రూ.2,42,400 నగదు, కారు స్వాధీనం చేసుకున్న పోలీసులు

Updated On
ehatv

ehatv

Next Story