రానురాను భార్య భర్తల మధ్య సంబంధాలు మంటగలుస్తున్నాయి. కొందరు వివాహేతర సంబంధాలతో తమ జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటున్నారు.

రానురాను భార్య భర్తల మధ్య సంబంధాలు మంటగలుస్తున్నాయి. కొందరు వివాహేతర సంబంధాలతో తమ జీవితాన్ని మధ్యలోనే ముగించుకుంటున్నారు. సంతోషకరమైన జీవితం, పిల్లలు, పరువు, కుటుంబం వంటివి ఆలోచించకుండా వేరొకరితో ఎఫైర్ నడుపుతూ.. చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి, చాలా సందర్భాల్లో కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్నాయి. వివాహేతర సంబంధాలు తరచూ భాగస్వాముల మధ్య గొడవలకు దారి తీసి.. విడాకులు, విడిపోవడం లేదా కుటుంబంలో నిరంతర విభేదాలకు కారణమవుతుంది. కుటుంబంలో పిల్లలు ఉంటే.. తమ తల్లిదండ్రుల వివాహేతర సంబంధాలు వల్ల వారి మానసిక ఆరోగ్యంపై లోతైన ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రుల మధ్య విభేదాలు, విడిపోవడం లేదా హింస వంటివి పిల్లలలో ఒత్తిడి, ఆందోళన కలుగుతుందని పరిశోధనలు చెప్తున్నాయి.

తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఏపీ(Ap)లోని చిత్తూరు జిల్లా(Chittoor)లో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు(Punganur)కు చెందిన వివాహిత గాయత్రి(Gayathri).కర్ణాటకకు (karnataka)చెందిన హరి(Hari) అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించింది. దీంతో హరితో కలిసి 15 రోజుల క్రితం ఊరు విడిచి వెళ్లిపోయింది. మళ్లీ ఏమైందో ఏమో కానీ గాయత్రి తిరిగి ఇంటికి వచ్చేసింది. అనంతరం గాయత్రి భర్త పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. . దీంతో ఈ ఇల్లీగల్ రిలేషన్‌షిప్ (illegal relationship)ఆ గ్రామంలో రచ్చకు దారి తీసింది. ఆపై ఇరు వర్గాలు గొడవకు దిగారు. అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు. మరోసారి ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ గొడవలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ గొడవ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ehatv

ehatv

Next Story