IVR calls: కూటమి ప్రభుత్వం పనితీరుపై ప్రజలకు ఐవీఆర్‌ ఫోన్లు.. షాకిస్తున్న ప్రజలు..?

ఏడాదిలో రాష్ట్ర ప్రజలకు అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి అంటూ అన్ని చేశామని కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌, డిప్యూటీ సీఎం సహా టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే పైకి మేకపోతులా గాంభీర్యం చూపుతున్నా లోలోపల ముగ్గురిలోనూ గుబులు చోటు చేసుకుందంటున్నారు. ముగ్గురు కలిసినా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ను 40 శాతం ఓట్ల నుంచి కిందకు రప్పించలేకపోయారు. జగన్ కన్నా వాళ్ళు గొప్పగా సాధించిన ఓట్లేమీ లేకున్నా సీట్లు గణనీయంగా వచ్చాయి. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినందును తనకు తానే ఓ సర్వే నిర్వహించుకుంటోంది కూటమి ప్రభుత్వం. అందుకే ఏడాది పాలన ముగిసిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సెల్ఫ్ చెక్ చేసుకుంటోంది.

బాబు పాలన ఎలా ఉంది అంటూ ప్రజలకు ఐవీఆర్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఏడాదిలోనే పనితీరును బేరీజు వేసుకుంటున్నారు. ఈ సర్వేలో ప్రజలు షాకింగ్‌ సమాధానాలిస్తున్నారని సమాచారం. ప్రజలు ఆ కాల్ రాగానే.. వింత శబ్దాలు, బూతులు తిడుతున్నారన్న సమాధానం ప్రభుత్వ పెద్దలకు చేరింది. దీంతో ఏం చేయాలో తోచడం లేదని తెలుస్తోంది. తల్లికివందనం.. ఆడబిడ్డ నిధి.. ఫ్రీ బస్సు.. నిరుద్యోగ భృతి.. రైతు భరోసా.. ఇలా ఏదీ అమలు చేయడంలేదని, ఈ హామీలపై ప్రజలు ఘోరంగా తిడుతున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వేలో తేలిందట. అభివృద్ధి.. సంక్షేమ వదిలేసి వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్ చేయడం.. కేసులు పెట్టి లోపల వేయడం వంటివి బూమా రంగు అవుతున్నట్లు తెలుస్తోంది.

కేకే సర్వే అనే సంస్థ కూడా ఇదే రిపోర్ట్ ఇచ్చింది. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు భారీగా గెలుస్తారని చెప్పింది కూడా ఈ కేకే సర్వే సంస్థ. అయితే అదే సంస్థ ఇప్పుడు దాదాపు 70 మందికి పైగా ఎమ్మెల్యేల మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చెబుతోంది. ఏడాదిలోనే ప్రజల్లో ఇంత వ్యతిరేక మొదలైందంటే రానున్న నాలుగేళ్లలో కూటమి నాయకులను పరిస్థితి ఎలా ఉంటుందోనని అంచనా వేస్తున్నారు. గ్రామాల్లో నాయకుల దందాలు.. పెచ్చుమీరిన క్రైమ్.. రౌడీయిజం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని బద్నాం చేస్తున్నాయి. ఆ భయం లోలోన ఉండబట్టే ఐవీఆర్ఎస్ సర్వే చేయించారని సమాచారం.

ehatv

ehatv

Next Story